ఏపీలో ముచ్చెమటలు.. 44.5 డిగ్రీల టెంపరేచర్ గురూ
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత నెక్స్ట్ లెవెల్కు చేరింది. చాలా జిల్లాల్లో ఉక్కపోత, వడగాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇక్కడ ఏకంగా 42 డిగ్రీల నుండి 44.5 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే కర్నూలు జిల్లా నగరడోనలో 43.5 డిగ్రీలు, పల్నాడు బెల్లంకొండలో 42.6 డిగ్రీల రికార్డ్ బ్రేక్ ఎండలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 66 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉండటంతో మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు.