ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్..
Pension Scheme : సమాజంలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో బ్రతికే హక్కు ఉంది... అందుకే ప్రభుత్వాలు ఆర్థికంగా వెనకబడిన పేదలకు వివిధ పథకాల ద్వారా సాయం చేస్తున్నాయి... ఇక శారీరక శ్రమ చేయలేని వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్నాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ను అమలుచేస్తోంది.
ప్రతి నెల వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, కళాకారులు, HIVతో జీవిస్తున్న వ్యక్తులు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులకు నెలనెలా రూ.4000 పెన్షన్ అందిస్తోంది కూటమి ప్రభుత్వం. అలాగే దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ అందిస్తోంది కూటమి ప్రభుత్వం.
చాలామందికి తెలిసింది ఈ పెన్షన్ల గురించే... కానీ ప్రభుత్వం మరికొందరికి కూడా ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అందిస్తోంది. అదీ నెలకు ఏ 4 వేలో, 6 వేలో కాదు ఏకంగా 10 వేలు, 15 వేలు. ఇంత భారీ పెన్షన్లకు ఎవరు అర్హులు..? ఎలా పొందాలి..? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.