Rain Alert: తెలుగు రాష్ట్రాల‌పై ద్రోణి ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన భారీ వ‌ర్షం, జాగ్ర‌త్త

Published : Mar 18, 2026, 08:12 AM IST

Rain Alert: తెల‌గు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో బుధ‌వారం (ఈరోజు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

PREV
15
ఏపీ జిల్లాల్లో ఎక్కడ ఎక్కువ ప్రభావం?

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన ఈ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రంగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాయలసీమలో మబ్బులు కమ్ముకున్నాయి. అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది.

25
తెలంగాణలోనూ మారిన వాతావరణం

తెలంగాణలో కూడా వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అర్థరాత్రి నుంచి పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతోంది. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

35
నాలుగు రోజులపాటు కొనసాగనున్న వర్షాలు

కర్ణాటక, తమిళనాడు వైపు నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశముంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

45
హైదరాబాద్‌పై ప్రభావం

దక్షిణ హైదరాబాద్‌పై భారీ వర్ష మేఘాలు కమ్ముకున్నాయి. మహేశ్వరం, షాద్ నగర్ వైపు నుంచి వచ్చిన ఈ మేఘాలు నగరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.

55
ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిల‌బ‌డ‌కూడ‌దు. విద్యుత్ స్తంభాలు, ఓపెన్ ప్రదేశాల దగ్గర ఉండకూడదు. బలమైన గాలుల వల్ల చెట్లు, హోర్డింగ్స్ పడే ప్రమాదం ఉంది. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి. రైతులు కోతకు సిద్ధమైన పంటలు, ఆరబోసిన ధాన్యం రక్షించాలి. మరోవైపు వాయుగుండం ప్రభావంతో వచ్చే ఆరు రోజులపాటు కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా కొంతవరకు తగ్గే అవకాశముంది.

Read more Photos on
click me!

Recommended Stories