ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఇప్పుడు రాష్ట్రంలో విస్తృతంగా ప్రయాణించవచ్చు. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో వర్తిస్తుంది. మొత్తం 7,000కుపైగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. డిజిటల్ పాస్లను మొబైల్ యాప్స్ లేదా బస్టాండ్ కౌంటర్ల ద్వారా పొందవచ్చు. QR కోడ్ ఆధారంగా సులభంగా వినియోగించుకోవచ్చు.
ప్రభుత్వం ఎంత ఖర్చు చేయనుందంటే.?
ఈ పథకం అమలుకు ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.207 కోట్లు ఖర్చు చేయనుంది. దివ్యాంగులకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళల కోసం అమలు చేసిన ‘స్త్రీ శక్తి’ పథకం విజయవంతమైంది. అదే విధంగా ఈ పథకం కూడా మంచి ఆదరణ పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.