IMD Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఓవైపు దిత్వా తుపాను బలహీనపడినా దాని ప్రభావం మాత్రం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం సాయంత్రం వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.
దిత్వా తుపాను బలహీనపడినా, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడటం వల్ల చలి పెరిగింది. శుక్రవారం సాయంత్రం వాతావరణ శాఖ తాజా ప్రకటనలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులపై స్పష్టమైన సూచనలు ఇచ్చింది. బంగాళాఖాతంలో తమిళనాడు–పుదుచ్చేరి సమీపంలో ఉన్న తీవ్రమైన అల్పపీడనం పూర్తిగా బలహీనపడిందని తెలిపింది.
25
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితి
అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. రాష్ట్రం–యానాం ప్రాంతంపై ఈశాన్య దిశలో గాలి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఉత్తర కోస్తా–యానాంలో శనివారం, ఆదివారం ఎండగా ఉండే అవకాశం ఉంది. వర్షాల సూచన తక్కువ ఉంది. అయితే దక్షిణ కోస్తాలో మాత్రం కొన్ని చోట్ల తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు నమోదు కావచ్చు. ఇక శనివారం, ఆదివారం ఒక్కో చోట జల్లులు పడొచ్చు. రాయలసీమ విషయానికొస్తే.. కొన్ని ప్రాంతాల్లో శనివారం, ఆదివారం తేలికపాటి వర్షాలు ఒక్కోచోట నమోదయ్యే సూచన ఉంది.
35
అల్పపీడనం బలహీనత
తమిళనాడు–పుదుచ్చేరి తీరాల దగ్గర ఉన్న అల్పపీడనం పూర్తిగా బలహీన పడడంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నా, రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో జల్లులు కొనసాగుతాయని అంచనా. గాలుల మార్పు కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాష్ట్రంలో ఒక్కోచోట తేలికపాటి వర్షాలు పడవచ్చు. అయితే ప్రధానంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వల్ల చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలులు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
55
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తెల్లవారుజామున, రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు, వృద్ధులు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీరప్రాంతాల్లో మత్స్యకారులు వాతావరణ సూచనలను గమనించి సముద్రంలోకి వెళ్లే ముందు హెచ్చరికలు పరిశీలించడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.