ఒకటో తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది.
• హాజరు: విద్యార్థికి తప్పనిసరిగా 75% వార్షిక హాజరు ఉండాలి.
• ఆదాయం: గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షలలోపు ఉండాలి.
• ఇతర అర్హతలు: కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం, సొంత కార్లు మొదలైనవి ఉండకూడదు. భూమి 10 ఎకరాల లోపు ఉండాలి, విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటకూడదు.
• పథకం కింద కేటాయించిన రూ.15,000 లలో పాఠశాలల మౌలిక వసతులు, నిర్వహణ కోసం రూ.2,000 కలెక్టర్ అకౌంట్కు వెళ్తుండగా, నికరంగా రూ.13,000 తల్లి అకౌంట్లో జమ అవుతాయి. ఈ విద్యాసంవత్సరం 1వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు ఆగస్టు 30న నిధులు విడుదల కానున్నాయి.