ఉత్తరాంధ్ర అంతా పండుగ వాతావరణం.. భారీ ఏర్పాట్లు
ప్రారంభోత్సవాన్ని ఉత్తరాంధ్ర ప్రజలందరి వేడుకగా మార్చాలని సీఎం సూచించారు. జూలై 31 వరకు విమానాశ్రయం గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమం ప్రాధాన్యం చేరేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. సభకు వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా థింసా, సవర, కొమ్ము కోయ వంటి గిరిజన నృత్యాలతో ఘన స్వాగతం పలకాలని సీఎం సూచించారు. అంతర్జాతీయ ప్లాట్ ఫామ్ లపై గుర్తింపు పొందుతున్న అరకు కాఫీ బ్రాండింగ్ను కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలపాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు.