AP Budget 2026 : పవన్ కల్యాణ్, లోకేష్ లలో పైచేయి ఎవరిది? ఎవరికెన్ని నిధులు దక్కాయో తెలుసా..?

Published : Feb 14, 2026, 03:27 PM IST

Andhra Pradesh Budget 2026-27 :  ఏపీ బడ్జెట్ 2026 నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ మొదలయ్యింది. రాష్ట్ర బడ్జెట్ లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లలో ఎవరికి అత్యధిక నిధులు దక్కాయి..? ఎవరిది పైచేయిగా నిలిచింది..? 

PREV
15
ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి..?

AP Budget 2026 : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ఆదాయం, ఖర్చులకు సంబంధించిన ప్రణాళికను ఇవాళ (ఫిబ్రవరి 14, శనివారం) అసెంబ్లీ సాక్షిగా ప్రజలముందు ఉంచారు. మొత్తం 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ పనులకు ఖర్చు చేయనుంది కూటమి ప్రభుత్వం.

అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగిన విషయం తెలిసిందే. పాలనాపరమైన వ్యవహారాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత తమ నాయకుడికే ప్రాధాన్యం దక్కాలంటూ ఇటు టిడిపి, అటు జనసేన నాయకుల మధ్య వాగ్వాదం సాగింది. చివరకు లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ టిడిపి శ్రేణుల నుండి వినిపించింది. కానీ పవన్, లోకేష్ ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు... దీంతో ఈ గొడవ సద్దుమణిగింది.

ఈ బడ్జెట్ 2026 సందర్భంగా మరోసారి పవన్, లోకేష్ ఆధిపత్యపోరు అంశం తెరపైకి వచ్చింది. బడ్జెట్ లో ఎవరి శాఖలకు ఎక్కువ కేటాయింపులు లభించాయి అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కాబట్టి ఈ బడ్జెట్ లో ఎవరిది పైచేయిగా నిలిచిందో చూద్దాం.

25
పవన్ కళ్యాణ్ శాఖలకు కేటాయింపులు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగానే కాదు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర & సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ బడ్జెట్ 2026 లో ఈ శాఖలో ఎన్ని నిధులు కేటాయించారో చూద్దాం.

పంచాయితీ రాజ్ శాఖకు ఈ బడ్జెట్ లో భారీగానే నిధులు దక్కాయి. మొత్తం రూ.22,942 కోట్లను ఈ శాఖకు కేటాయించింది ప్రభుత్వం. ఇక అటవీ, శాస్త్ర సాంకేతిక రంగాలకు కూడా నిధులు దక్కాయి. ఇలా పవన్ కళ్యాణ్ శాఖలకు దాదాపు రూ.23,000 కోట్ల నుండి రూ.25,000 కోట్ల వరకు దక్కాయి.

35
నారా లోకేష్ శాఖలకు కేటాయింపులు...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలోనే కాదు కూటమి ప్రభుత్వంలోనే కీలక నాయకుడు. చెప్పాలంటే తండ్రి తర్వాత సెకండ్ ప్లేస్ అతడిదే. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ విషయం బైటపడింది... తాజాగా బడ్జెట్ 2026 లోనూ ఇది స్పష్టంగా కనిపించింది.

లోకేష్ మానవ వనరుల అభివృద్ధి (విద్యాశాఖ),స‌మాచార సాంకేతికత (ఐటీ), ఎలక్ట్రానిక్స్‌ ఆండ్ కమ్యూనికేషన్స్‌, రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రిత్వ శాఖలు చూసుకుంటున్నారు. ఇందులో ఆయన విద్యాశాఖపై స్సెషల్ ఫోకస్ పెట్టారు.. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ లో పాఠశాల విద్యాశాఖకు ఏకంగా రూ.32,308 కోట్లు నిధులు దక్కాయి.

ఇక విద్యాశాఖకు సంబంధించిన పథకాలు, ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించింది కూటమి ప్రభుత్వం. విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనానికి రూ.2161 కోట్లు, విద్యార్థుల ఉపకారవేతనాలకు రూ.3,836 కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు, నైపుణ్యాభివృద్ధి రూ. 1,232 కోట్లు కేటాయించారు. ఇలా విద్యాశాఖకు భారీగా నిధులు దక్కాయి.

హైదరాబాద్ కు పోటీగా రాష్ట్రంలో ఐటీ రంగాన్ని డెవలప్ చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖపట్నం, అమరావతి వంటి ప్రాంతాల్లో పెట్టుబుడులకు ముందుకువచ్చిన కంపెనీలకు రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖకు నిధులు కేటాయించింది.

45
పవన్ పై లోకేష్ దే పైచేయి..

పపన్ కళ్యాణ్, నారా లోకేష్ మధ్య పొలిటికల్ గా కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం నేపథ్యంలో బడ్జెట్ 2026 లో ఎవరు పైచేయి సాధించారో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నారా లోకేష్ శాఖలకు ఈ బడ్జెట్ లో అత్యధిక నిధులు దక్కాయి... ఆ తర్వాతి స్థానంలోనే పవన్ కళ్యాణ్ శాఖలు నిలిచాయి. టిడిపిలోనే కాదు పాలనలోనూ లోకేష్ ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పడానికి ఈ బడ్జెట్ 2026 లో జరిగిన కేటాయింపులే నిదర్శనం.

55
నెక్ట్స్ సీఎం లోకేషేనా..?

తన వారసుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు చంద్రబాబు నాయుడు సిద్దం అవుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెతను చంద్రబాబు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.. ప్రస్తుతం అంతా సజావుగా సాగుతున్న సమయంలోనే లోకేష్ ను పొలిటికల్ గా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసమే తరచూ తనతో పాటు లోకేష్ ను కూడా డిల్లీకి తీసుకెళుతున్నారు చంద్రబాబు... కేంద్ర పెద్దలతో పరిచయాలు పెంచుతున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని టిడిపి నాయకులందరితో లోకేష్ సత్సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు... అందుకోసమే తాజాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటుచేశారు. ఇలా లోకేష్ ను చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం దిశగా నడిపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories