రాష్ట్ర అభివృద్ధికి కీలక రంగాలకు గణనీయ కేటాయింపులు చేశారు:
అమరావతి రాజధాని నిర్మాణం: రూ. 6,000 కోట్లు
పోలవరం ప్రాజెక్టు: రూ. 6,105 కోట్లు
విద్యుత్ రంగం: రూ. 13,934 కోట్లు
రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులు: రూ. 13,546 కోట్లు
పరిశ్రమల అభివృద్ధి: రూ. 3,161 కోట్లు
గృహ నిర్మాణం: రూ. 5,451 కోట్లు
విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను రాష్ట్ర వృద్ధి ఇంజిన్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ. 28,000 కోట్లు కేటాయించగా, రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు.
వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
వ్యవసాయ రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు:
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు: రూ. 9,906 కోట్లు
అన్నదాత సుఖీభవ: రూ. 6,600 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన: రూ. 1,927 కోట్లు
పంటల భీమా: రూ. 250 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి: రూ. 500 కోట్లు
మత్స్యకారుల సేవలో: రూ. 260 కోట్లు
2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
సంక్షేమం, విద్య, సామాజిక రంగం
సామాజిక సంక్షేమ పథకాల కోసం భారీ కేటాయింపులు చేశారు:
ఎన్టీఆర్ భరోసా: రూ. 27,719 కోట్లు
తల్లికి వందనం: రూ. 9,668 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం: రూ. 4,581 కోట్లు
ఉపకారవేతనాలు: రూ. 3,836 కోట్లు
సమగ్ర శిక్ష: రూ. 2,946 కోట్లు
ఉన్నత విద్య: రూ. 2,566 కోట్లు
మధ్యాహ్న భోజన పథకం: రూ. 2,161 కోట్లు
నైపుణ్యాభివృద్ధి: రూ. 1,232 కోట్లు
యువత, క్రీడలు: రూ. 438 కోట్లు
అదనంగా, ఆరోగ్య రంగంలో ఎన్టీఆర్ వైద్య సేవకు రూ. 4,000 కోట్లు, తాగునీటి కోసం జల్ జీవన్ మిషన్కు రూ. 4,000 కోట్లు కేటాయించారు.