అల్పపీడన ప్రభావంతో మే 13 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
మే 14, 15 తేదీల్లో రాయలసీమలో కూడా ఉరుములు మెరుపులు కనిపిస్తాయి. అయితే వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి కాబట్టి, చెట్ల కింద గానీ, కరెంట్ స్తంభాల దగ్గర గానీ ఉండటం సేఫ్ కాదని అధికారులు తెలిపారు.