బుధవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు కూడా ఉండొచ్చని హెచ్చరించింది.
పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మేఘాలు కమ్ముకుని ఉరుములు వినిపించిన వెంటనే చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.