IMD Rain Alert: మ‌రింత బ‌ల‌ప‌డుతోన్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు

Published : May 12, 2026, 08:39 PM IST

IMD Rain Alert: ఏపీలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 

PREV
14
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉత్తర తమిళనాడు నుంచి రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

24
ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాల సూచన

బుధవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు కూడా ఉండొచ్చని హెచ్చరించింది.

పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మేఘాలు కమ్ముకుని ఉరుములు వినిపించిన వెంటనే చెట్ల కింద‌ నిలబడకుండా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

34
ఏజెన్సీ ప్రాంతాల్లో వడగాలుల హెచ్చరిక

మరోవైపు అల్లూరి జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలు మధ్యాహ్న వేళ బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు తగినంత నీరు తాగుతూ ఎండ నుంచి రక్షణ పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

44
పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

మంగళవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు భారీగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 42.4 డిగ్రీలు, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42 డిగ్రీలు నమోదయ్యాయి.

అలాగే ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41.9 డిగ్రీలు, మార్కాపురం జిల్లా కంభంలో 41.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 41.3 డిగ్రీలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా తెరన్నపల్లి, వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో 41.1 డిగ్రీలు నమోదయ్యాయి.

అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 41 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 40.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లా రాయలపేటలో 40.5 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరులో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories