స్లీప‌ర్ బ‌స్సులో ప‌క్క‌ప‌క్క సీట్లు టికెట్ బుక్ చేసుకున్న ప్రేమికులు.. పోలీసుల వ‌ర‌కు చేరిన వ్య‌వ‌హారం

Published : Feb 17, 2026, 04:01 PM IST

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చిన్న సీటింగ్ వివాదం చివరకు గొడవకు, ఆ తర్వాత దాడికి దారితీసింది. ఈ ఘటనలో బస్ డ్రైవర్ గాయపడగా, యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

PREV
15
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం ప్రయాణం

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓ ప్రేమజంట మచిలీపట్నం వెళ్లేందుకు ప్రైవేట్ స్లీపర్ బస్సులో రెండు బెర్తులు ముందుగానే బుక్ చేసుకున్నారు. ప్రయాణం సాఫీగా సాగుతుందని భావించారు. అయితే బుకింగ్ వివరాల్లో ఉన్న పేర్లు తర్వాత సమస్యకు కారణమయ్యాయి.

25
బుకింగ్ పేర్లలో గందరగోళం

బస్ టికెట్లలో రెండు సీట్లు కూడా యువతుల పేర్లతోనే నమోదు అయినట్లు డ్రైవ‌ర్ గుర్గించాడు. ప్రయాణం ప్రారంభమైన తర్వాత సిబ్బంది ఐడి వివరాలు పరిశీలించే సమయంలో ఈ విషయం బయటపడింది. కంపెనీ నిబంధనల ప్రకారం టికెట్‌పై ఉన్న పేరుకు భిన్నంగా ప్రయాణించడం అనుమతించలేమని డ్రైవర్ స్పష్టం చేశాడు. దీంతో ప్రేమజంట అభ్యంతరం వ్యక్తం చేసింది.

35
బస్సులో వాగ్వాదం.. ప్రయాణికుల జోక్యం

డ్రైవర్, యువకుడి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ పక్కపక్కనే స్లీపర్ బెర్త్‌లో ఉండాలని యువతి పట్టుబట్టినట్లు సమాచారం. అయితే నిబంధనలను కారణంగా చూపుతూ డ్రైవర్ నిరాకరించాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని గొడవను ఆపారు. కొంతసేపటికి బస్సు మళ్లీ ప్రయాణం కొనసాగించింది.

45
బస్టాండ్ వద్ద మళ్లీ ఉద్రిక్తత

మచిలీపట్నం చేరుకున్న తర్వాత పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఇద్దరినీ కలిసి కూర్చోనివ్వలేదని యువతి ఆగ్రహం వ్యక్తం చేయ‌డంతో.. యువకుడు డ్రైవర్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

55
పోలీసుల కేసు నమోదు, దర్యాప్తు

డ్రైవర్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నపాటి సీటింగ్ వివాదం ఇలా దాడికి దారి తీసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్ బుకింగ్ సమయంలో సరైన వివరాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories