ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ఈ విజయం స్ఫూర్తిదాయకం. టెక్ రంగంలో ముందుకు సాగాలనుకునే వారికి సాత్విక్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన మరొక ప్రఖ్యాత టెక్ ప్రముఖుడు, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను గుర్తు చేస్తూ, ఈ ప్రాంతం మరోసారి ప్రతిభావనిని నిరూపించుకుంది.
సాత్విక్ రెడ్డి విజయం కృషి, విద్యా నిబద్ధత, కలల సాధనకు సంకేతం. ప్రపంచ వేదికపై తెలుగోడు మెరుస్తున్న ప్రతిసారి, దేశ గౌరవం మరింత పెరుగుతోంది. ప్రస్తుతం తాడిపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నారు.