ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేక జోన్:
నగరాన్ని తొమ్మిది సబ్సిటీలుగా ప్లాన్ వేస్తున్నారు. అందులో ఒకటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో అసెంబ్లీ, హైకోర్టు, 50 అంతస్తుల సచివాలయం, 42 అంతస్తుల నాలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ టవర్లు ఉంటాయి. ప్రభుత్వం ఉన్న ప్రాంతాన్నే నగరానికి కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.