కొన్ని కూరగాయల్లో సహజంగానే తేమ ఉంటుంది. వాటిని ఉడికించేటప్పుడు నీళ్ళు పోస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి.
కొన్ని కూరగాయలను ఉడికించేటప్పుడు నీళ్ళు పోయకూడదు. కొన్ని కూరగాయల్లో సహజంగానే తేమ ఉంటుంది. వాటిని ఉడికించేటప్పుడు నీళ్ళు పోస్తే రుచి, రంగు, పోషకాలు - అన్నీ ప్రభావితం అవుతాయి. ఇప్పుడు అలాంటి కూరగాయల గురించి తెలుసుకుందాం. బెండకాయ, అరటికాయ, బ్రోకలీ లాంటి కూరగాయలకు కూడా నీళ్ళు పోయకూడదు.
నీళ్ళు లేకుండా ఉడికించాల్సిన 7 కూరగాయలు
1. ఆనపకాయ (Bottle Gourd)
ఆనపకాయ దీనినే చాలా మంది సొరకాయ అని కూడా పిలుస్తారు. దీనిలో దాదాపు 92% నీళ్ళు ఉంటాయి. ఉడికించేటప్పుడు దీని నుంచి సహజంగా నీళ్లు బయటకు వస్తాయి. ఈ కూర వండే సమయంలో పొరపాటున కూడా నీళ్లు పోయకూడదు.
నీళ్ళు పోస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి. అలా నీళ్లు పోసి వండితే.. దానిని తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు.
2. వంకాయ (Brinjal)
వంకాయ కూర వండే సమయంలో కూడా నీళ్లు పోయకూడదు. దానిలో నుంచి నీరు వస్తుంది. ముఖ్యంగా ఉప్పు వేసి ఉడికిస్తే… వెంటనే నీళ్లు వస్తాయి.
నీళ్ళు పోస్తే జిగురుగా, రుచిలేకుండా అవుతుంది.
3. పుట్టగొడుగులు (Mushroom)
పుట్టగొడుగులు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని కూడా నీళ్లు పోసి వండకూడదు. సహజంగానే ఇవి 85–90% నీళ్ళతో తయారవుతాయి. నూనెలో వేసి మూత పెడితే.. దీనిలో నుంచి నీరు వస్తుంది.
నీళ్ళు పోస్తే రుచి, టెక్స్చర్ రెండూ పాడవుతాయి.
4. పాలకూర, తోటకూర (Spinach, Amaranth, Bathua)
ఈ కూరల్లో సహజంగానే తేమ ఉంటుంది. ఉడికిస్తే నీళ్ళు వదులుతాయి.
నీళ్ళు పోస్తే చాలా లేతగా, రుచిలేకుండా అవుతాయి.
5. బీరకాయ (Ridge Gourd/Sponge Gourd)
ఇందులో కూడా చాలా తేమ ఉంటుంది.
నీళ్ళు పోస్తే రుచి పోతుంది.
6. కాబేజీ (Cauliflower)
కొంచెం నీళ్ళతో మూతపెట్టి ఉడికిస్తే చాలు.
నీళ్ళు పోస్తే ముక్కలు విడిపోతాయి, క్రంచ్ పోతుంది.
7. టమాటా (Tomato)
టమాట కూడా నీరు ఎక్కువగా ఉండే కూరగాయల. ముఖ్యంగా ఉల్లిపాయలు, మసాలాలతో ఉడికిస్తే… మంచి గ్రేవీలాగా కూర తయారౌతుంది.
నీళ్ళు పోస్తే గ్రేవీ పలుచగా అవుతుంది, రుచి తగ్గుతుంది.
ఇంతకీ ఈ కూరగాయలను ఎలా ఉడికించాలి?
తక్కువ మంట మీద మూతపెట్టి ఉడికించాలి. అప్పుడు కూరగాయలు మంచి గ్రేవీ కూరల్లా తయారౌతాయి.
మొదట్లో కొంచెం ఉప్పు వేస్తే కూరగాయలు త్వరగా నీళ్ళు వదులుతాయి.
మసాలా దోరగా వేగిన తర్వాత కూరగాయలు వేయాలి. అదనపు నీళ్ళు పోయకూడదు.