ఆ డైరెక్టర్ నన్ను సెట్స్ లో బూతులు తిట్టాడు... రామ్ చరణ్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

By team teluguFirst Published Oct 28, 2021, 3:18 PM IST
Highlights

ఈషా గుప్త ఓ డైరెక్టర్ తనను సెట్స్ లో దుర్భాషలాడారంటూ ఆవేదన చెందారు. సదరు డైరెక్టర్ రెండు సార్లు సెట్స్ లో తనను తిట్టినట్లు వెల్లడించారు. 
 

 
బాలీవుడ్ హాట్ బాంబ్ ఈషా గుప్త సంచలన ఆరోపణలు చేశారు. ఓ డైరెక్టర్ తనను సెట్స్ లో దుర్భాషలాడారంటూ ఆవేదన చెందారు. సదరు డైరెక్టర్ రెండు సార్లు సెట్స్ లో తనను తిట్టినట్లు వెల్లడించారు. 


Esha gupta మాట్లాడుతూ సెట్స్ లో డైరెక్టర్ హిందీలో ఏదో అన్నారు. నేను ఆయన వైపు అలా చూశాను. అప్పుడు, నువ్వు లేటుగా వచ్చావ్ అని డైరెక్టర్ కోప్పడ్డారు.. నిజానికి ఆయన కోపం నేను లేటుగా రావడం కాదు. నా కాస్ట్యూమ్ గురించి. నిజానికి నేను లేట్ గా కూడా సెట్స్ కి రాలేదు. వాళ్లందరికంటే ముందే నేను సెట్ కి రావడం జరిగింది. అసలు సమస్య అంతా నా కాస్ట్యూమ్ గురించే. ఆ విషయంలో కూడా నా తప్పులేదు. 


రెండో సారి మరింత దారుణమైన భాషలో నన్ను తిట్టాడు. మొదటిసారి తిట్టినప్పుడు నేను వదిలేశారు. రెండోసారి సహనంగా ఉండడం నావల్ల కాలేదు. నేను తిరిగి తిట్టేశాను. అలాగే షూటింగ్ సెట్స్ నుండి వెళ్ళిపోయాను. తరువాత ఆ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి సారీ చెప్పారు. డైరెక్టర్ సారీ చెబితే కానీ నేను షూటింగ్ కి రానని గట్టిగా చెప్పాను. రెండు రోజుల తరువాత ఆ డైరెక్టర్ నాకు సారీ చెప్పారు... అంటూ తనకు ఎదురైన చేదు అనుభవం పంచుకుంది. 

Aslo read వాళ్ళిద్దరి ఇష్టం తెలుసుకుని,ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లి చేస్తాం.. దీప్తితో పెళ్లిపై షణ్ముఖ్ తల్లి సంచలనం
2012లో విడుదలైన జన్నత్ 2 చిత్రంతో వెండితెరకు పరిచమైన ఈషా గుప్త.. తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో Ram charan కి జంటగా ఓ స్పెషల్ సాంగ్  చేయడం జరిగింది. అంతకు ముందు సచిన్ జోషి హీరోగా విడుదలైన వీడెవడు చిత్రంలో హీరోయిన్ గా నటించారు. సోషల్ మీడియాలో సూపర్ హాట్ ఫోటో షూట్స్ కి ఈషా గుప్త చాలా ఫేమస్. ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటాయి. 

Also read Samantha Naga chaitanya divorce: చైతు జ్ఞాపకాలు చెరిపేస్తున్న సమంత, ఆ ఫోటోలు డిలీట్

click me!