తెలుగులో మల్టీ స్టారర్ సైన్ చేసిన సిద్దార్ద్

By Surya PrakashFirst Published Apr 28, 2020, 1:06 PM IST
Highlights

 'ఆర్ ఎక్స్ 100'తో భారీ విజయాన్నిచ్చిన అజయ్ భూపతి విషయంలో మాత్రం అలా జరగలేదు. 'మహా సముద్రం' కథ పట్టుకుని ఆయన హీరోల చుట్టూ తిరుగుతూనే వున్నాడు. రవితేజ .. చైతూ ఈ కథ పట్ల అంతగా ఆసక్తిని చూపలేదు. అయితే ఇప్పుడు శర్వానంద్, సిద్దార్ద ఈ సినిమా చేయటానికి సైన్ చేసినట్లు సమాాచారం.


సిద్దార్ద ఒకప్పుడు తెలుగు సినిమా లవర్ బోయ్. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నే వద్దంటానా వంటి చిత్రాలతో తెలుగువారికి బాగా దగ్గరైన రొమాంటిక్ హీరో. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏమీ ఆడలేదు. దానికి తోడు తెలుగు నిర్మాతలు, మీడియాతో వచ్చిన రకరకాల సమస్యలతో ఇక్కడ ఆయన మనుగడ అనేది లేకుండా పోయింది. దానకి తోడు తమిళంలో వచ్చి ఆడిన సినిమాలు సైతం ఇక్కడ డబ్బింగ్ అయ్యి వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో ఎవరూ సిద్దార్ద్ ని కన్సిడర్ చేయటం లేదు. కానీ ఇంతకాలానికి సిద్దార్ద్ హీరోగా ఓ మల్టిస్టారర్ రూపొందటానికి రంగం సిద్దమైంది. ఇంతకీ సిద్దార్ద్ ని మళ్లీ తెలుగు తెరపై తీసుకురావటానికి కంకణం కట్టుకుంది ఎవరూ అనేదేగా మీ ప్రశ్న. ఆ దర్శకుడు మరెవరో కాదు అజయ్ భూపతి. 

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సూపర్ సక్సెస్ ఫుల్ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సిద్దార్ద్ ని హీరో గా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ మల్టిస్టారర్ లో మరో హీరోగా శర్వానంద్ చేయబోతున్నారు. గత కొంతకాలంగా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు మహా సముద్రం అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా ఓ స్టార్‌ హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


ఆర్ ఎక్స్ 100'తో భారీ విజయాన్నిచ్చిన అజయ్ భూపతిని వరస ఆఫర్స్ ముంచెత్తలేదు. 'మహా సముద్రం' కథ పట్టుకుని ఆయన హీరోల చుట్టూ తిరుగుతూనే వున్నాడు. రవితేజ .. చైతూ ఈ కథ పట్ల అంతగా ఆసక్తిని చూపలేదు. ఇక శర్వానంద్ ముందుగా మొగ్గు చూపినా, 'జాను' ఫ్లాప్ తరువాత ఆలోచనలో పడ్డాడని సమాచారం. అయితే ఆయను చివరకు ఒప్పించేందుకు అజయ్ భూపతి గట్టి ప్రయత్నాలు చేసాడని తెలుస్తోంది. 

సాయిపల్లవికి కూడా కథ వినిపించాడట. సాయిపల్లవి ఇంకా ఏ విషయం చెప్పవలసి ఉందని అంటున్నారు. ఇంతకుముందు శర్వానంద్ జోడీగా ఆమె 'పడి పడి లేచె మనసు' చేసింది. త్వరలో కిషోర్ తిరుమల దర్శకత్వంలోను ఈ జంట కలిసి నటించనుంది. మళ్లీ శర్వానంద్ సరసన అంటే సాయిపల్లవి ఒప్పుకుంటుందా? అనేది చూడాలి.
 

click me!