షెర్లిన్‌ చోప్రాపై రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిల పరువు నష్టం దావా.. ఏకంగా యాభై కోట్లు..

By Aithagoni RajuFirst Published Oct 20, 2021, 7:31 AM IST
Highlights

తనపై ఆరోపణలు చేసిన బాలీవుడ్‌ శృంగార తార షెర్లీన్‌ చోప్రాపై ప్రతీకారం తీర్చకుంటున్నారు శిల్పాశెట్టి దంపతులు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ రాజ్‌కుంద్రా పరువు నష్టం దావా వేశారు. 

బాలీవుడ్‌ శృంగార తార, మోడల్‌ షెర్లిన్‌ చోప్రా చిక్కుల్లో పడ్డారు. పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై ఆమె అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దానికి ప్రతీకారం తీర్చకుంటున్నారు Shilpa Shetty దంపతులు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ Raj Kundra పరువు నష్టం దావా వేశారు. అది మామూలు దావా కాదు, ఏకంగా రూ. 50కోట్ల పరువు నష్టం దావా వేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో రాజ్‌కుంద్రాపై కేసు పెట్టింది Sherlyn Chopra. తనని లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఆరోపించింది. ఇటీవల మరోసారి ఆయనపే కేసు నమోదు చేసింది. ఈ కేసులో తమని అన్యాయంగా ఇరికించారని చెబుతూ ఆమె ఆరోపణల్లో నిజం లేదని వెల్లడిస్తూ, అవి పూర్తి అవాస్తవాలని, అందుకు ఎలాంటి ఆధారాలు లేవని యాభై కోట్ల పరువు నష్టం దావా వేశారు.

అనవసరంగా తనని ఇరికించాలని, వివాదాలు సృష్టించాలని, మీడియాని ఆకర్షించేదంఉకు ఆమె ఇలాంటి తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చిందని రాజ్‌కుంద్రా దంపతులు ఆరోపించారు. ఈ మేరకు వారి తరఫున న్యాయవాదులు కోర్ట్ లో పరువు నష్టం దావా వేశారు. ఇదిలా ఉంటే జులై 19న బాలీవుడ్‌లో Pornography Case(నీలిచిత్రాలు) కేసులో రాజ్‌కుంద్రాని ముంబయి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలకుపైగా ఆయన పోలీస్‌ కస్టడీలో ఉన్నారు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. 

also read: త్వరలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటాం.. కత్రినాతో రూమర్స్ పై విక్కీ కౌశల్‌ స్టేట్‌మెంట్‌ వైరల్‌..

బాలీవుడ్‌లో ఈ పోర్నోగ్రఫీ కేసు సంచలనం సృష్టించింది. శిల్పాశెట్టి భర్త ఇలాంటి పనిచేస్తున్నాడనే వార్త అందరికి షాక్‌కి గురి చేసింది. ఇది శిల్పాశెట్టికి కూడా పెద్ద షాకింగ్‌ విషయమే. తన భర్త ఏం చేస్తున్నాడో తనకు తెలియదని ఆమె పోలీసుల ముందు వెల్లడించింది. కొన్నాళ్లపాటు ఆమె టీవీ షోస్‌ని కూడా పక్కన పెట్టి ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో తాను ఎంతో మానసికంగా కృంగి పోయానని, మీడియాలో కథనాలు తనని మరింతగా బాధకి గురి చేస్తున్నాయని, ఓ లేఖని విడుదల చేసింది శిల్పా శెట్టి. ఆ తర్వాత కొన్ని రోజులకు తిరిగి ఆమె తాను జడ్జ్ గా వ్యవహరిస్తున్న `సూపర్‌ డాన్సర్‌` షోకి జడ్జ్ గా వెళ్లారు. ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. 

ఇదిలా ఉంటే అశ్లీల వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ బాలీవుడ్‌లో దుమ్ము దుమారం క్రియేట్‌ చేస్తుంది షెర్లీన్‌ చోప్రా. శృంగార తారగా పాపులర్‌ అయిన ఈ భామ అర్థనగ్నంగా, అవసరమైతే నగ్నంగానూ ఫోటోలకు పోజులిస్తూ కుర్రాళ్లని చిత్తు చేస్తుంది. సంచలనాలకు తెరలేపుతుంది. 

also read: ఫ్యామిలీ ప్లానింగ్ కోసం షారుక్ మూవీ వదులుకున్న సమంత!

click me!