నిర్మాత వివేక్ కూచిబొట్లపై అసభ్యకరంగా బూతులు.. యువ దర్శకుడిపై కేసు నమోదు

By tirumala ANFirst Published Jan 13, 2024, 2:46 PM IST
Highlights

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థకి చెందిన ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్లపై రాజసింహ తాడినాడ అనే యువ దర్శకుడు సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన కామెంట్స్ తీవ్ర వివాదంగా మారాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థకి చెందిన ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్లపై రాజసింహ తాడినాడ అనే యువ దర్శకుడు సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన కామెంట్స్ తీవ్ర వివాదంగా మారాయి. కథల విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అయితేగొడవలకు కథలు మాత్రమే కారణమా ఇతర కారణాలు కూడా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. 

రాజసింహ తన సోషల్ మీడియాలో వివేక్ కూచిబొట్లని బ్రోకర్, వెధవ, ఇంకా చెప్పలేని అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ పోస్ట్ చేశారు. దీనితో వివేక్ కూచిబొట్ల రాజసింహపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తన ప్రతిష్టని దిగజార్చే విధంగా రాజసింహ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపు సందేశాలు పంపుతున్నారని వివేక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Latest Videos

దీనితో పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. తన తో పాటు రాఘవేంద్ర రావు, వైవియస్ చౌదరి, ఠాగూర్ మధు లాంటి వాళ్ళని కూడా రాజసింహ దూషిస్తున్నట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు. వివేక్ కూచిబొట్లపై అసభ్యకర వ్యాఖ్యలని ఖండించిన దర్శకుడు విఎన్ ఆదిత్యపై కూడా రాజసింహ విరుచుకుపడ్డారు. అతడిపైన కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఆదిత్య దర్శకత్వం వహించిన ఉదయ్ కిరణ్ చిత్రం మనసంతా నువ్వే హిందీ నుంచి కాపీ చేసిన మూవీ అని రాజసింహ తన పోస్ట్ లో పేర్కొన్నారు. 

రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ తో ఎండార్స్మెంట్స్ కూడా చేసిన రాజసింహ, ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వర్క్ చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ తో ఒక చిత్రం తెరకెక్కించినప్పటికీ అది డిజాస్టర్ గా మారింది. 

click me!