నేను శ్రావణిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు : అశోక్‌రెడ్డి

By Satish ReddyFirst Published Sep 16, 2020, 3:10 PM IST
Highlights

అశోక్‌ రెడ్డి మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తాను ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడలేదని, శ్రావణిని తాను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్టుగా వచ్చిన వార్తలు కూడా అవాస్తవం అని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే అశోక్‌ రెడ్డి కూడా పోలీసులు అదుపులో ఉన్నారు.

టీవీ నటి శ్రావణి హత్యకేసు ఒక్కో చిక్కుముడి వీడుతోంది. ఈ కేసులో కీలకంగా మారిన దేవరాజ్‌, సాయికృష్ణ, అశోక్‌రెడ్డిలను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే ప్రేమ పేరుతో ముగ్గరు శ్రావణిని మోసం చేయటంతోనే ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దేవరాజ్‌, సాయికృష్ణలు మాత్రం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

అశోక్‌ రెడ్డి మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తాను ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడలేదని, శ్రావణిని తాను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్టుగా వచ్చిన వార్తలు కూడా అవాస్తవం అని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే అశోక్‌ రెడ్డి కూడా పోలీసులు అదుపులో ఉన్నారు.

ఇదిలావుంటే, టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. తొలుత మూడో నిందితుడిగా ఉన్న దేవరాజు రెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు తమ వద్ద రిమాండ్ రిపోర్టు ఉందంటూ ఓ ప్రముఖ టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.

click me!