'లవ్ స్టోరీ' ట్రైలర్:  చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం

By telugu teamFirst Published Sep 13, 2021, 12:25 PM IST
Highlights

చాలా రోజుల క్రితమే విడుదల కావాల్సిన లవ్ స్టోరీ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా పరిస్థితులు అనుకూలించక నిర్మాతలు ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

చాలా రోజుల క్రితమే విడుదల కావాల్సిన లవ్ స్టోరీ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా పరిస్థితులు అనుకూలించక నిర్మాతలు ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసింది. 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తొలి సారి చైతు, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సాంగ్స్, సాయి పల్లవి.. చైతు మధ్య రొమాన్స్ తో మొదటి నుంచి మంచి బజ్ ఏర్పడింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగా ఉంది. 

ట్రైలర్ మొత్తం ఫన్ అండ్ ఎమోషనల్ గా సాగుతోంది. చైతు, సాయి పల్లవి తెలంగాణ యాసలో డైలాగులతో అదరగొడుతున్నారు. 'నేనేం చదివిన తెలుసా.. బీటెక్' అంటూ సాయి పల్లవి ఆకట్టుకుంటోంది. ఆమె రైన్ డాన్స్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. 

ఫ్యామిలీ ఎమోషన్స్, జాబ్ కోసం చైతు, సాయి పల్లవి పడే తిప్పలు, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఇలా అన్ని అంశాలని శేఖర్ కమ్ముల పర్ఫెక్ట్ గా మిక్స్ చేసినట్లు ఉన్నారు. ట్రైలర్ చివర్లో 'చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం' అంటూ నాగ చైతన్య ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 

 

click me!