శంకర్‌-చెర్రీ మూవీ: మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫైనల్, రెహమాన్ కాదు

By Surya PrakashFirst Published Jul 19, 2021, 10:22 AM IST
Highlights

ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో.. కుదిరితే ఆలోపే ప్రారంభించాలనుకుంటున్నారట శంకర్‌.ఈ క్రమంలో ఈ చిత్రానికి సంభందించిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ఫైనల్ చేశారు.

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.   ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ మూవీలో రామ్‌చరణ్‌ పోలీసాఫీసర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారే యువకుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ‘ఇండియన్‌ 2’ సినిమా వివాదంలో చిక్కుకున్న శంకర్‌కు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఊరటనివ్వటంతో రామ్‌చరణ్‌తో శంకర్‌ చేయనున్న ఈ సినిమాకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో.. కుదిరితే ఆలోపే ప్రారంభించాలనుకుంటున్నారట శంకర్‌.ఈ క్రమంలో ఈ చిత్రానికి సంభందించిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ల ఎంపిక జరుగుతోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి మాటల రచయితగా బుర్రా సాయి మాధవ్ ని ఎంపిక చేసారు. తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ఫైనల్ చేశారు.

It gets bigger and better as Music Sensation joins

Here’s a sneak peek into the first recording by Thaman and a team of 135 musicians who left and mesmerized. pic.twitter.com/NWbrSd90eF

— Sri Venkateswara Creations (@SVC_official)

 మామూలుగా శంకర్‌ డైరెక్ట్‌ చేసే చాలా చిత్రాలకు ఏఆర్‌ రెహమానే సంగీతం అందిస్తారు. ఇప్పుడీ ఈ సమాధానంతో శంకర్‌-చెర్రీల సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తారని టాక్‌ వినిపించింది. కానీ ఈ సారి మర్చారు. పూర్తిగా తెలుగు ఫ్లేవర్‌ని యాడ్‌ చేస్తున్నారు. తమన్ గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన `బోయ్స్` సినిమాలో ఓ పాత్రను చేసారు. మళ్లీ ఇంతకాలానికి ఇద్దరూ కలిసి పనిచేయనున్నారు. ఇద్దరి మధ్యా మంచి చనువు ఉంది. దాంతో శంకర్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. తమన్,శంకర్ త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్  కూడా మొదలయ్యాయి. 

తమన్ మాస్ మ్యూజిక్‌కు, శంకర్‌ టేకింగ్‌కు రామ్‌చరణ్‌ పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌ తోడైతే వెండితెరపై పండగ వాతావరణమే. దిల్‌ రాజు నిర్మించనున్న ఈ చిత్రం ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన నేపథ్యంలో కథ ఉండనున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా 2022లో ఈ ప్రాజెక్టు రిలీజ్ కానుంది.

ఇలా.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్లాన్‌ను పక్కాగా రెడీ చేసే పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు శంకర్. కాగా ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఖారారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్‌చరణ్‌-కియారా అద్వానీ జంటగా నటించిన సంగతి తెలిసిందే. 
 

click me!