ప్రభాస్ భూవివాదం కేసు.. అధికారులను నిలదీసిన కోర్టు!

By Udayavani DhuliFirst Published Jan 2, 2019, 1:48 PM IST
Highlights

నటుడు ప్రభాస్ భూవివాదంపై దాఖలు  చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రాయదుర్గంలో తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై ప్రభాస్ పిటిషన్ వేయగా దానికి రెవెన్యూ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.

నటుడు ప్రభాస్ భూవివాదంపై దాఖలు  చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రాయదుర్గంలో తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై ప్రభాస్ పిటిషన్ వేయగా దానికి రెవెన్యూ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.

రెగ్యులైజేషన్ కోసం ప్రభాస్ పెట్టుకున్న అభ్యర్ధనను పరిశీలనలో ఎందుకు వెనక్కి పంపారని అధికారులను కోర్టు ప్రశ్నించింది. దీంతో పూర్తి వివరాలను రేపు కోర్టు ముందు ఉంచుతామని న్యాయవాది తెలిపారు.

శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద ప్రభాస్ కు చెందిన స్థలంలో రెవెన్యూ శాఖ అధికారులు జోక్యం  చేసుకొని సీజ్ చేయడంతో ప్రభాస్ హైకోర్టుని సంప్రదించాడు.  అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఇటువంటి చర్యలకు పాల్పడినట్లు ప్రభాస్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా చూపించి తన స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.  

ప్రభాస్ భూ వివాదం: రెవెన్యూశాఖ కౌంటర్ దాఖలు!

ప్రభాస్ పిటిషన్.. విచారణ మళ్లీ వాయిదా!

ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ సీజ్..నేడు హైకోర్టులో విచారణ

కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్

ఇల్లు సీజ్: హైకోర్టులో హీరో ప్రభాస్ పిటిషన్!

ప్రభాస్ ఇంటి వివాదం.. కోర్టు ఏమంటుందంటే..?

బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు: ప్రభాస్

వాదనలు రేపు వింటాం.. ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు!

 

click me!