ఒకరు ఫిల్మ్ స్టార్, మరొకరు బ్యాడ్మింటన్ స్టార్. ఈ ఇద్దరు స్టార్స్ మిటింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు కలిసి ఒక ఫంక్షన్ లో సందడి చేశారు.
పుష్ప ది రైజ్ మూవీ సక్సెస్ తో అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ హైదరాబాద్ లో జరిగిన వివాహ రిసెప్షన్ లో పాల్గొనగా ఫ్యాన్స్ సందడి చేశారు. ఆ ఫంక్షన్ లో పాల్గొన్న స్టార్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి వి. సింధు , అల్లు అర్జున్ తో ఫోటో దిగారు. ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
పుష్పలో అదరగొట్టిన తర్వాత, సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీ ఎక్కడ కనిపిస్తే అక్కడ సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా బన్నీ అల్లు అర్జున్ తో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్లో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమారుడు నిఖిల్ నిశ్చితార్థ వేడుకలో కనిపించాడు బన్నీ సందడ చేశారు. ఇక అక్కడికి భారతీయ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు వచ్చారు. వీరిద్దరు కలిసి మాట్లాడుతున్న ఫోటో సోష్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈవెంట్లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. వైట్ షర్ట్ బ్లాక్ కోట్ తో బ్లాక్ బ్లేజర్ తో ముచ్చటగా ఉన్నాడు బన్నీ. ఇక బ్యూటిఫుల్ లెహంగాలో... పివి సింధు క్యూట్ లుక్ లో కనిపించారు.
Stylish Star &
Hari 🤩♥️ pic.twitter.com/XUz1AloOV6
మైత్రీ మూవీ మేకర్స్ ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఆడియన్స్ ,అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. .పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ ఘనవిజయం సాధించి , దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పై క్రేజ్ ను పెంచింది.