కర్నూలు జిల్లాలో దారుణం: భర్తను బంధించి గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్

By telugu teamFirst Published Aug 3, 2020, 2:59 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. వెలిగోడులో భర్తను చితకబాది లాక్కెళ్లి అతని భార్యపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ఓ గిరిజన మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను బంధించి వారు ఆ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని వెలిగోడులో జరిగింది.

నలుగురు దుండగులు గిరిజన మహిళ భర్తను చితకబాది లాక్కెళ్లి బంధించారు. ఆ తర్వాత గిరిజన మహిళపై దురాగతానికి పాల్పడ్డారు. దీంతో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

భర్తతో కలిసి వెళ్తుండగా లాక్కెళ్లి వెలుగోడు సమీపంలోనే తండాలో దుండగురు ఆ దురాగతానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. ఈ సంఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తీవ్ర నిరసనలు వ్కక్తమవుతున్నాయి 

ఇదిలావుంటే, ఇంట్లోని పురుషుడిని బంధించి అతని భార్యపై, కూతురిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడి స్టోన్ క్రషింగ్ ప్రాంతానికి సమీపంలో బాధితులు నివసిస్తుంటారు.

ఇంట్లోకి దుండగులు చొరపడి దుండగులు మహిళ భర్తను బంధించారు. ఆ తర్వాత ఆమెను, 12 ఏళ్ల కూతురిని ఎత్తుకెళ్లి పక్కన ఉన్న పొలాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లోంచి నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. 

ఆరుగురు దుండగులు శుక్రవారంనాడు ఆ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితులను బుర్హాన్ పూర్ ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి నిలకడగానే ఉంది. బాధితురాలి భర్త కూలీ పనులు చేస్తుంటాడు. కుటుంబం ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందినవారని తెలుస్తోంది. 

భుశవాల్ నుంచి ఏడాది క్రితం ఇక్కడికివచ్చి వారు స్టోన్ క్రిషింగ్ యూనిట్ లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. నిద్రిస్తున్న తమ గుడిసెలోకి దుండగులు ప్రవేశించి, తన భార్యను, కూతురుని తీసుకుని వెళ్తున్నప్పుడు వ్యక్తి సాయం కోసం కేకలు వేశారు. అయితే ఇరుగుపొరుగు వారు సాయం కోసం వచ్చారు. వారిని కూడా దుండగులు బంధించారు. 

click me!