తమ పార్టీలోకి వస్తున్నందువల్ల పార్టీ మరింత బలోపేతం చెందుతుందన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరితే అతని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
కర్నూలు: తెలుగుదేశం పార్టీలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరికపై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఎస్వీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు నచ్చి కేంద్రమంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలోకి రావడం మంచి పరిణామమన్నారు.
తమ పార్టీలోకి వస్తున్నందువల్ల పార్టీ మరింత బలోపేతం చెందుతుందన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరితే అతని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇకపోతే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. అతని భార్య మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు డోన్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఆయన తనయుడు రాఘవేంద్రరెడ్డి కర్నూలు అసెంబ్లీ నుంచి లేదా కర్నూలు మేయర్ గా పోటీ చెయ్యించాలని కోరుతున్నారు.
అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కర్నూలు పార్లమెంట్ స్థానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. డోన్ కాకుండా ఆలూరు నియోజకవర్గం కోట్ల సుజాతమ్మకు ఇస్తే ఎలా ఉంటుంది అన్న అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...
కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?
కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్
టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే
చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ