Champaran: నాథూరామ్ గాడ్సే తుపాకీ గుండ్లకు బలికావడానికి ముందు కూడా భారత జాతిపిత మహాత్మా గాంధీని చంపడానికి అనేక కుట్రలు జరిగాయి. రైతులపై ఆంగ్లేయుల ఆగడాల నేపథ్యంలో చంపారన్ లోని వారిని కలవడానికి బీహార్ గుండా ప్రయాణించే సమయంలో హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నాడు. అయితే, బటాఖ్ మియాన్ అన్సారీ అనే వంట మనిషి గాంధీజీ ప్రాణాలను రక్షించాడు. ఈ విషయం చాలా మంది భారతీయులకు తెలియదు.