ఇటీవల భర్త చంద్రబాబు నాయుడు లేకుండానే తిరుమలకు వచ్చి స్వామివారికి గోడు చెప్పుకున్నానని... అది ఆయన విన్నారని భువనేశ్వరి అన్నారు. స్వామి ఆశిస్సులతోనే ఇప్పుడిలా భర్తతో కలిసి తిరుమలకు వచ్చినట్లు నారా భువనేశ్వరి ఎమోషనల్ కామెంట్స్ చేసారు.
ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఏపీ ప్రజలకు భువనేశ్వరి బహిరంగ లేఖ రాశారు. తనకు జరిగిన అవమానం మరొకకిరి జరగకూడదని ఆమె అన్నారు.