Assam CM Himanta Biswa Sarma's: మదర్సా అనే పదం ఇప్పుడు రాష్ట్రంలో ఉనికిలో లేదని, పాఠశాలల్లో అందరికీ సాధారణ విద్యపై దృష్టి పెట్టాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. అస్సాంలోని అన్ని మదర్సాలను రద్దు చేసి.. సాధారణ పాఠశాలలుగా మార్చాలన్న తన ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు.