Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికపై అత్యాచారయత్నం... పురుగుల మందు తాగించి హత్య

ఒంటరిగా కనిపించిన యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాందుడు దారుణానికి ఒడిగట్టాడు. 

ఒంటరిగా కనిపించిన యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాందుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికను అనుభవించాలన్న కోరిక నెరవేరక పోవడంతో కిరాతకంగా వ్యవహరించిన ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.  తంగళ్లపల్లి మండలం కేంద్రంలో నివాసముండే మైనర్ బాలిక మధుమిత(15) కు మాయమాటలు చెప్పి బండి రాజు అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాలికకు పురుగుల మందు త్రాగించి ఆ తర్వాత అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారిద్దరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ఇవాళ యువతి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.