Asianet News TeluguAsianet News Telugu

ఆ ఎమ్మెల్యేలంతా మాతో టచ్ లోనే... టిడిపి ఎమ్మెల్సీ గెలుపు ఖాయం : అచ్చెన్నాయుడు

అమరావతి : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వందకు వందశాతం గెలుస్తారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేసారు.

అమరావతి : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వందకు వందశాతం గెలుస్తారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేసారు. టిడిపి వీడిన నలుగురు ఎమ్మెల్యేలు సైతం తమకే ఓటేస్తారని... తల్లిలాంటి పార్టీని వీడి తప్పు చేసామని మాతో చెప్పారని అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలోని పరిస్థితులను చూస్తున్నారని... తమకు గౌరవం దక్కడంలేదని అంతర్మధనం చెందుతున్నారని అన్నారు. వారు కూడా ఆత్మ ప్రభోదానుసారం ఓటేసే అవకాశాలున్నాయి కాబట్టి మా గెలుగు ఖాయమని గట్టి నమ్మకంతో వున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ఇక వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి కూడా ఆంతరాత్మ  ప్రభోదం మేరకే ఓటేసినట్లు తెలిపారు. ఇంకెవరయినా వైసిపి ఎమ్మెల్యేలు ఇలా అంతరాత్మ ప్రభోదానుసారం ఓటేసారో లేదో తనకు తెలియదని... వారి ఆత్మల్లోకి దూరి చూసేందుకు తానేమీ దేవున్ని కాదన్నారు.