Triple Talaq: ఒడిశాలోని కేంద్రపరాలో ఓ మహిళ సైబర్ మోసం వల్ల రూ.1.5 లక్షలు పోగొట్టుకుంది. దీంతో ఆగ్రహించిన తన భర్త ఫోన్ చేసి.. ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె భర్తపై పోలీసులు ట్రిపుల్ తలాక్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మరో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. పెళ్లైన ఐదు నెలలకే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు భర్త. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకొంది.