Hyderabad: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా సమాచారం అందించాలని తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE)ను ఆదేశించింది.