కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అకాల వర్షాలతో తడిచి, మొలకలు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు రైతులు మానసిక ఒత్తిడితో గుండె ఆగి, ఆత్మహత్యలకు ఒడిగట్టి ప్రాణాలు వదులుతున్నారన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదని.. ఈ సమస్యపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఉందని వాయిదా తీర్మానం ఇచ్చారు రేవంత్ రెడ్డి.