Hyderabad: మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో (ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు) జగ్గుస్వామికి మంగళవారంనాడు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నిన్న సిట్ విచారణకు జగ్గుస్వామి, బీఎల్ సంతోష్, తుషార్ లు హాజరు కావాల్సి ఉంది. ఈ ముగ్గురు కూడా విచారణకు రాలేదు. ఈ క్రమంలోనే సిట్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని సమాచారం.