బస్తర్ రీజియన్లో నిర్మాణంలో ఉన్న ఓ రోడ్డును సర్వే చేస్తూ సబ్ ఇంజనీర్ అజయ్ లక్రా మావోయిస్టులకు పట్టుబడ్డాడు. ఆయనతోపాటు ఓ ప్యూన్ కూడా మావోయిస్టులకు చిక్కారు. ప్యూన్ను రెండు రోజుల తర్వాత విడిచిపెట్టినా, సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను మాత్రం వారం తర్వాత బుధవారం మధ్యాహ్నం ఓ రోడ్డుపై వదిలిపెట్టారు. ఈ సందర్భంలో అజయ్ లక్రా సతీమణి కూడా ఉన్నారు.