కాంగ్రెస్, బీజేపీలపై పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి , ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్ లా కలిసి పని చేస్తున్నారని, ఆ రెండు పార్టీలు నాంపల్లిలోనే ఉన్నాయనీ, ఈ పార్టీకి ఆ పార్టీకి మధ్య సొరంగం తవ్వుకున్నారని ఏద్దేవా చేశారు.