కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని కాగ్ రిపోర్టులో వెల్లడించింది. ఈ రిపోర్ట్ను ఆధారం చేసుకుని కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతరావు ఈసీకి లేఖ రాశారు. ఈ రుణాల చెల్లింపు పూర్తయ్యే దాకా లేదా 2035-36 వరకు బీఆర్ఎస్ పార్టీపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.