భాగ్యనగరం బోనమెత్తింది. నగరంలోని అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర వైభవంగా సాగుతుంది. లాల్దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ప్రారంభం అయ్యాయి.
హైదరాబాద్ : ఆషాడమాస బోనాలు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు పిల్లాపాపలతో తరలివస్తున్న భక్తులతో సికింద్రాబాద్ ప్రాంతం సందడిగా మారింది.