ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ పూర్వీకులు దేశ ద్రోహులంటూ ధ్వజమెత్తారు. బీజేపీకి అసదుద్దీన్ బీ టీమ్ అని చెప్పబోనని, కానీ, అసదుద్దీన్ ఎంత ఎక్కువ మాట్లాడితే మోడీకి అంత ప్రయోజనకరం అని వివరించారు.