Asianet News TeluguAsianet News Telugu

Manipur Violence: మణిపూర్ ఎందుకు మండిపోతున్నది? ఆ రాష్ట్ర చరిత్ర ఇదీ

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఎందుకు చోటుచేసుకున్నాయి. అక్కడి పరిస్థితులు, ఆ రాష్ట్ర చరిత్ర ఏమిటనే విషయాలను ప్రస్తావించి ప్రస్తుత సమస్యను మాజీ అసోం డీజీపీ, అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పల్లబ్ భట్టాచార్య చర్చిస్తున్నారు.
 

why north eastern state manipur burning? what are the faultlines kms
Author
First Published Jun 3, 2023, 3:08 PM IST

న్యూఢిల్లీ: మైతేయిలకు ఎస్టీ హోదా ఇవ్వరాదని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్.. ట్రైబల్ సంఘీభావ ర్యాలీ చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో హింస మొదలైంది. స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో పొరపాట్లు, సమస్యలు కొనసాగుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తున్నది.

ఇందులో మొదటి తప్పు.. బ్రిటీష్ ఇండియాలో మణిపూర్ రాష్ట్ర చేరికలో జరిగినది. బ్రిటీష్ పాలన కాలంలో మణిపూర్ ఒక సంస్థానం. 1930వ దశకం మలి సంవత్సరాల్లో ఈ సంస్థానం బర్మాలో కాకుండా బ్రిటీష్ పాలిత భారత్‌లో చేరాలని ప్రతిపాదించింది. 1935లో స్వాతంత్ర్య సమరాన్ని బలహీనపరచడానికి బ్రిటీషర్లు భారత్ నుంచి బర్మాను వేరుచేశారు. 1947 ఆగస్టు 11న చేరిక గురించి మహారాజా బుధాచంద్ర సంతకం పెట్టగా 1949 సెప్టెంబర్ 21వ తేదీన విలీన ఒప్పందంపై  సంతకం పెట్టారు. ఈ నిర్ణయాన్ని కొన్ని మణిపూర్ గ్రూపులు వ్యతిరేకించాయి. నిర్ణయంపై ఏకాభిప్రాయం రాకముందే విలీనం చేశారనే వాదన మైతేయి తిరుగుబాటుకు బీజం వేసింది.

రెండో సమస్య.. మణిపూర్ జనాభా తీరులో ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 41.39 శాతం హిందువులు, 41.29 శాతం క్రిస్టియన్లు, 8.39 శాతం ముస్లింలు, మిగిలినవారు జైనులు, బుద్ధులు మొదలగువారు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 28.6 లక్షల జనాభాలు ట్రైబల్ జనాభా 11.67 లక్షలు. ఇందులో ఎక్కువ మంది క్రిస్టియన్లే.

మూడోది.. 53 శాతం జనాభా కేవలం లోయలో నివసిస్తున్నారు. అంటే రాష్ట్రంలోని సుమారు 64 శాతం మంది కేవలం 10 శాతం స్థలానికే పరిమితం అయ్యారు. వీరికి 40 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే 90 శాతం కొండ ప్రాంతాల ప్రజలను కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 53 శాతం జనాభాగాల మైతేయీలు ఆ లోయకే పరిమితం అయ్యారు. ఇది ట్రైబల్ కమ్యూనిటీలు నాగాలు, కుకీల మధ్య ఘర్షణాపూరిత వాతావరణానికి కారణంగా ఉన్నది.

Also Read: మణిపూర్‌లో పోలీసుల కాల్పుల్లో 40 మంది తిరుగుబాటుదారులు హతం: సీఎం బీరెన్ సింగ్.. ‘కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు’

నాలుగోది.. మణిపూర్ రీజియన్. దీనికి ఒక వైపు మిజోరం, అసోం, నాగాల్యాండ్‌లు ఉండగా మరో వైపు 352 కిలోమీటర్ల చొప్పున మయన్మార్ సరిహద్దు ఉంటుంది. ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ ద్వారా 16 కిలోమీటర్ల మేరకు సరిహద్దులో నివసించే వారు ఎదుటి దేశంలో వీసా లేకుండా వెళ్లడానికి ఆస్కారం ఉన్నది. ఈ సరిహద్దు గుండా కుకీలు చొరబడుతున్నారని, వారి జనాభా పెంచుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారని మైతేయీల వాదన.

2012కు ముందే మణిపూర్ ఎస్టీ డిమాండ్ కమిటీ మైతేయీలకు ఎస్టీ హోదాను అడిగింది. మైతేయిలు రాష్ట్రం దేశంలో విలీనం చేయడానికి ముందు నుంచే ట్రైబల్స్‌గా గుర్తించబడినవారని ఈ కమిటీ పేర్కొంది. ఈ కమ్యూనిటీని కాపాడి, వారి పూర్వీకుల భూమి, సాంప్రదాయం, సంస్కృతి, భాష వంటి వాటిని కాపాడుకునే అవకాశం కల్పించాలనేది వారి డిమాండ్. మయన్మార్ నుంచి చొరబడినవారు తమపై దాడి చేస్తారనే భావనలో మైతేయీ ఉన్నారని చెబుతున్నారు.

53 శాతమున్న మైతేయీలు 90 శాతమున్న కొండ ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేయరాదు. అదే 90 శాతం భూమిలో ఉన్న ట్రైబల్స్ మాత్రం అటు లోయలో ఇటు మైదాన ప్రాంతాల్లోనూ కొనుగోలు చేయడానికి వీలుంది. ఈ గందరగోళం.. లోయలో భూమిని మరింత తగ్గిపోవడానికి ప్రేరేపించింది. దీర్ఘకాలంగా తమ కమ్యూనిటీని కూడా బలహీనం చేశారనే ఆలోచనలతో ఉన్న నాగాలిమ్ కమ్యూనిటీ ద్వారా కూడా మైతేయీలకు ముప్పు ఉంటుంది. 1951లో 59 శాతం జనాభా గల తమ కమ్యూనిటీ ఇప్పుడు 44 శాతానికి పడిపయిందని తెలిపింది.

ఇదిలా ఉండగా మైతేయీల ఎస్టీ డిమాడ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు రాష్ట్రానికి ఇచ్చిన ఆదేశాలను జారీ చేసింది. దీంతో మైతేయీలు తమ వాటానూ భుక్తం చేస్తారని, వారి పలుకుబడిపై నమ్మకంతో ట్రైబల్స్ భావించారు. కానీ, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో అధికంగా కుకీలే ఉన్నారని మైతేయీలు తిరిగి వాదిస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల కారణంగా అక్కడ హింస చెలరేగినప్పుడు కేంద్రం వెంటనే కట్టడి చర్యలు తీసుకోలేదు. కానీ, ఇప్పుడు వేగంగా పరిస్థితులు అదుపులోకి తెచ్చింది.

అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి కింది చర్యలు తీసుకోవాలి..

1. 1965 లోకూర్ కమిటీ, 2002-04 భురియా కమిషన్, ప్రొఫెసర్ విర్జీనియస్ సాసా సారథ్యంలోని 2013 హై లెవెల్ కమిటీల సిఫారసుల ఆధారంగా మైతేయీలకు ఎస్టీ హోదాను పరిశీలించాలి.

2. ట్రేడ్, టూరిజం, అగ్రికల్చరల్ పార్మింగ్ మొదలైనవి, యాక్ట్ ఈస్ట్ పాలసీ క్రియాశీలం చేయడం, ట్రైబల్, మైతేయీ ప్రజలు ఒకరిపై ఒకరు ఆధారపడి సాగేలా చర్యలు తీసుకోవడం వంటివి చేపట్టాలి.

3. అసోం తరహాలోనే మణిపూర్‌లోనూ మెల్లమెల్లగా AFSPAను తొలగించాలి.

4. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా వేయాలి.

 

----పల్లబ్ భట్టాచార్య

Follow Us:
Download App:
  • android
  • ios