Best CM Survey: ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించి ప్రజల అభిప్రాయం అడిగారు. ఇందులో సీఎం యోగి ఆదిత్యనాథ్ బెస్ట్ పెర్ఫార్మర్‌గా ప్రజల మొదటి ఎంపికగా నిలిచారు. ఢిల్లీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ పేరు యోగి ఆదిత్యనాథ్ తర్వాత రెండవ స్థానంలో ఉంది. 

Yogi Adityanath is the best CM of the country: ప్రస్తుతం దేశంలో 30 రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇందులో ఢిల్లీ, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ సర్వేలో బెస్ట్ సీఎం ఎవరనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ప్రజలు తమ మొదటి ఎంపికగా అభివర్ణించారు. ఉత్తమ పనితీరు కనబరిచే ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ప్రకారం నవీన్ పట్నాయక్ స్వదేశంలో అత్యధిక రేటింగ్స్‌తో సీఎంలలో అగ్రస్థానంలో నిలిచారు. అతని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో ప్రజాదరణను భారీగా పెంచుకున్నారు. వారి సొంత రాష్ట్రాల్లో అత్యధిక సంతృప్తి రేటింగ్‌లు ఉన్న 10 మంది ముఖ్యమంత్రులలో ఆరుగురు బీజేపీకి చెందినవారు కావడం గమనార్హం.

వివ‌రాల్లోకెళ్తే.. ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేలో దేశ మానసిక స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సర్వేలో ఉత్తమ సీఎంను ఎంపిక చేసే విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రజల మొదటి ఎంపికగా నిలిచారు. ఈ సర్వే ప్రకారం 39.1 శాతం మంది ప్రజలు యోగి ఆదిత్యనాథ్ నుఉత్తమ పనితీరు కనబరిచే ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నారు.

తగ్గిన కేజ్రీవాల్, మమతల పాపులారిటీ

యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు అరవింద్ కేజ్రీవాల్ పేరు రెండో స్థానంలో ఉంది. 16 శాతం మంది ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ ను తమ ఎంపికగా చేసుకున్నారు. ఇక మూడో స్థానంలో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నారు. 7.3 శాతం మంది ప్రజలు ఉత్తమ పనితీరు కనబరిచిన సీఎంల జాబితాలో మ‌మ‌తాకు మూడో స్థానం ఇచ్చారు. సీఎం యోగి పనితీరు వల్లే ఆయనకు ప్రజాదరణ పెరిగిందని సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ ప్రజాదరణ గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 6 శాతం తగ్గింది. 2022 ఆగస్టులో కేజ్రీవాల్ 22 శాతం మంది ఎంపిక చేశారు. మమతా బెనర్జీ పాపులారిటీ కూడా గత ఏడాదితో పోలిస్తే 1 శాతం తగ్గింది.

దేశంలోని 30 రాష్ట్రాల్లో ఉత్తమ సీఎంను ఎంపిక చేసేందుకు ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 1,40,917 మంది పాల్గొన్నట్లు స‌ర్వే ప్ర‌తినిధులు పేర్కొన్నారు. 

2024లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందనే ప్రశ్నలు కూడా ఈ సర్వేలో అడిగారు. ఈ సర్వేలో మరోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని తేలింది. బీజేపీకి 284 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పెద్దగా లేకపోయినా కాంగ్రెస్ పనితీరు మెరుగైంది. కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అదే సమయంలో ఇతర పార్టీల వాటాలో 191 సీట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీనే మోస్ట్ ఫేవరెట్ పొలిటీషియన్ గా కొనసాగుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది తమ పనిపై సంతృప్తి వ్యక్తం చేశారు.