గాంధీ జయంతి 2023: బాపూజీ జీవితానికి సంబంధించి మీకు తెలియని కొన్ని విషయాలు
gandhi jayanti 2023: ఇండియాను స్వతంత్ర్య దేశంగా మార్చడానికి గాంధీ చేసిన కృషి అంతా ఇంతా కాదు. మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న పోర్ బందర్ లో జన్మించారు. అందుకే ప్రతి ఏడాది బాపూజీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ జయంతిని జరుపుకుంటారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నేడు గాంధీజయంతి. ఈ సందర్భంగా నేడు ప్రతి ఒక్కరూ జాతిపిత మహాత్మాగాంధీని స్మరించుకుంటారు. భారత స్వాతంత్య్రానికి విశేష కృషి చేసిన గాంధీజీని ఆప్యాయంగా బాపు అని పిలుస్తారు. మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఈ రోజును గాంధీ జయంతిగా జరుపుకుంటారు. మహాత్మాగాంధీ గురించి మనకు ఎన్నో విషయాలు తెలుసు. చిన్నప్పటి నుంచి పాఠ్యపుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం.. కానీ బాపుకు సంబంధించిన కొన్ని విషయాలు మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నోబెల్ బహుమతి రాలేదు
సత్యం,శాంతి, అహింస సందేశాన్ని బోధించడానికి మహత్మాగాంధీ తన జీవితమంతా గడిపారు. నిజానికి ఈయన చాలా సైలెంట్ వ్యక్తి. కానీ ప్రజలకు ఎప్పుడూ కూడా అహింసా మార్గాన్నే చూపారు. కానీ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహాత్మా గాంధీకి ఎన్నడూ కూడా నోబెల్ శాంతి బహుమతి అందలేదు. 1937, 1938, 1939, 1947 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతికి గాంధీజీ నామినేట్ అయినా కూడా ఆయన ఎన్నడూ ఆ పురస్కారాన్ని అందుకోలేదు. అంతే కాదు గాంధీజీ హత్యకు గురైన 1948 సంవత్సరంలో కూడా నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డారు. కానీ ఆ సంవత్సరం కూడా ఆయనను నోబెల్ కమిటీ ఎంపిక చేయలేదు.
బాల్యవివాహం
మనలో చాలా మందికి మహాత్మాగాంధీ బాల్యవివాహం చేసుకున్నారన్న సంగతి తెలియదు. అవును గాంధీజీ తన 13 ఏండ్ల వయసులోనే కస్తూర్బా మాకెన్జీని వివాహం చేసుకున్నాడు. అది అరేంజ్డ్ మ్యారేజ్. గాంధీజీకి ఏండేంట్ల వయసులోనే కస్తూర్బాతో నిశ్చితార్థం జరిగింది. ఈ వివాహంతో గాంధీకి నలుగురు కొడుకులు కలిగారు.
గాంధీజీ ఉద్యమం దక్షిణాఫ్రికా నుంచి ప్రారంభం
న్యాయశాస్త్రం గాంధీజీ 1888లో ఇంగ్లాండు వెళ్లారు. చదువు పూర్తైన తర్వాత మహాత్మాగాంధీకి 1893లో దక్షిణాఫ్రికాలోని ఓ భారతీయ సంస్థలో పనిచేసే అవకాశం లభించింది. అయితే ఆ సమయంలో దక్షిణాఫ్రికాను బ్రిటన్, డచ్ వారు పాలించారు. ఈ సమయంలో ఇతర భారతీయుల మాదిరిగానే గాంధీజీ కూడా ఎప్పుడూ వివక్షను ఎదుర్కొన్నాడు. ఈ వివక్ష, దుర్వినియోగం గాంధీజీని దక్షిణాఫ్రికాలో భారతీయుల పౌర హక్కుల కోసం ఒక ప్రచారాన్ని ప్రారంభించడానికి ప్రేరేపించింది. దీంతో అక్కడే తన మొదటి ఉద్యమాన్ని ప్రారంభించాడు.
గాంధీ హత్య
మన దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడానికి గాంధీజీ చేసిన కృషి ఎన్నటికీ మరువు లేనిది. అందరినీ ఎకతాటిపై తెచ్చి దేశం కోసం ఎంతో పోరాడాడు. తన జీవితంలో స్వాతంత్య్రం కోసం ఎన్నో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి దేశ స్వాతంత్య్రంలో కీలక పాత్ర పోషించారు. జాతిపిత అలుపెరగని కృషి ఫలితంగా ఎట్టకేలకు 15 ఆగస్టు 1947న బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలల తర్వాత అంటే 1948 జనవరి 30 న న్యూఢిల్లీలో ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు.
మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ బంధువులు కాదు
ఒకే ఇంటిపేరు ఉండటం వల్ల మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీలు బంధువులని భావించే వారు చాలా మందే ఉన్నారు. కానీ వీరు అసలు బంధువులే కాదు. ఇందిరాగాంధీ దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె. ఆ తర్వాత దేశ ప్రధాని అయ్యారు.