రెజినాతో రిలేషన్పై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్, ఇంతకీ ఏమన్నాడంటే..?
చాలా కాలంగా తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. హీరోయిన్ రెజీనాతో తన రిలేషన్ పై నోరు విప్పాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లపై గాసిప్స్ కామన్. సోషల్ మీడియాలో రూమర్స్ కూడా కామన్. వరుసగా ఓ రెండు సినిమాలు చేస్తే చాలు వారిపై రకరకాల వార్తలు వండి వడ్డిస్తుంటారు. ఒక్కోసారి అవి హద్దులు దాటుతుంటాయి. ఇక కొంత మంది విషయంలో అయితే.. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుంటాయి.
ఇలాంటి విషయాలలో కొంత మంది సెలబ్రిటీలు వెంటనే స్పందిస్తుంటారు..మరికొందరు లైట్ తీసుకుంటారు.. ఇంకొందరు మాత్రం రివర్స్ కౌంటర్లు వేస్తుంటారు. ఇలాంటి రూమర్స్ వలలో చిక్కిన జంటల్లో టాలీవుడ్ యంగ్ స్టార్స్ సందీప్ కిషన్, రెజీనా కసాండ్రాలు కూడా ఉన్నారు.
దాదాపు పదేళ్ల నుండి ఈ జంట రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తునే ఉన్నాయి. మా మధ్య అలాంటిదేమి లేదంటూ ఇద్దరు తారలు ఎంత మొత్తుకున్నా.. రూమర్స్ మాత్రం ఆగడంలేదు. ఇండస్ట్రీలో వీళ్లపై వచ్చినన్ని గాసిప్స్ ఎవరిపై రాలేవేమో. ఇప్పటికీ వీళ్లపై పెళ్లి రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
ఇక ఈ విషయంలో రీసెంట్ గా సందీప్ కిషన్ స్పందించాడు. ఆయన ఏమన్నారంటే.. మేమిద్ధరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. తను నా బెస్ట్ ఫ్రెండ్. పన్నెండేళ్లుగా ఒకరికొకరం తెలుసు. మేం ఫ్రెండ్స్ మాత్రమే. తను బాంబే వస్తే.. మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుంది. అన్నారు.
అంతే కాదు మేము ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రస్ట్ ఉండదు కదా.. మా మధ్య ఏదో ఒకటి ఉంది అని చెప్పేదాక మీకు ప్రశాంతత ఉండదు. మా మాధ్య ఏదో ఉంది అంటేనే మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఇప్పటికీ నేను ఒకటే చెపుతున్నాను ... మరోసారి క్లారిటీ ఇస్తున్నాను. మేము ఫ్రెండ్స్ మాత్రమే అని అన్నారు.
రీసెంట్ గా సందీప్ కిషన్ మైఖేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కు.. మైఖేల్ మూవీ ఊరటనిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాడు. కాని ఈ మూవీ కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించడంలేదు. శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కీలకపాత్రల్లో నటించారు.