- Home
- Entertainment
- సీనియర్ హీరోయిన్ విజయశాంతికి, ఆమె భర్తకు బెదిరింపులు.. కసి తీరే వరకు అంటూ దారుణంగా..
సీనియర్ హీరోయిన్ విజయశాంతికి, ఆమె భర్తకు బెదిరింపులు.. కసి తీరే వరకు అంటూ దారుణంగా..
సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి బెదిరింపులు వెళ్లాయి. దీంతో విజయశాంతి దంపతులు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమని బెదిరిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి బెదిరింపులు వెళ్లాయి. దీంతో విజయశాంతి దంపతులు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమని బెదిరిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. డబ్బు కోసమే చంద్ర శేఖర్ విజయశాంతి దంపతులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి నాలుగేళ్ళ క్రితం చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడట. తాను సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తుంటానని శ్రీనివాస్ ప్రసాద్ కి తెలిపాడు. తనకి డబ్బు ఇస్తే కావలసిన విధంగా విజయశాంతి కోసం సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తానని తెలిపాడు. ముందు పనితీరు నచ్చితే ఆ తర్వాత కాంట్రాక్ట్ ఇస్తానని విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ అతడికి చెప్పాడు.
కానీ కొంత కాలం తర్వాత చంద్రశేఖర్ పనితీరు శ్రీనివాస్ ప్రసాద్ కి నచ్చలేదు. అతడు అనుకున్న విధంగా ఫలితాలు చూపెట్టలేదు. దీనితో అతడితో కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు. బయటకి పంపేశారు. ఇంతలో చంద్రశేఖర్ తాను విజయశాంతికి సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తుంటానని చెప్పుకుంటూ పలువురు రాజకీయ నాయకుల వద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.
ఇటీవల చంద్రశేఖర్.. విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కి మెసేజ్ పెట్టాడు. తాను పనిచేసినందుకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని మెసేజ్ లో అడిగాడు. అసలు ఒప్పందమే లేనప్పుడు డబ్బులు అడగడం ఏంటి అని శ్రీనివాస్ ప్రసాద్ చంద్రశేఖర్ ని ప్రశ్నించారు. ఈ విషయమై ఇంటికి వచ్చి మాట్లాడాలని చెప్పారు. కానీ చంద్రశేఖర్ విజయశాంతి ఇంటికి వెళ్ళలేదు. కానీ తనకి డబ్బులు ఇవ్వకపోతే పరువుతీస్తా, రోడ్డుకి ఈడుస్తా.. మీ కుటుంబాన్ని కసి తీరే వరకు దారుణంగా చంపుతా అంటూ బెదిరింపు మెసేజ్ లు పెట్టాడు.
అతడి ప్రవర్తన దారుణంగా ఉండడంతో విజయశాంతి దంపతులు బంజారా హిల్స్ పోలీసులని ఆశ్రయించి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు. దీనితో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలని ఎంచుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ తో కలసి ఆమె నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే చిత్రం ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.