నటుడు రాజేంద్రప్రసాద్ ఈ శుక్రవారం `షష్టిపూర్తి` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. తాజాగా ఆయన అలీ, రోజా, మురళీమోహన్లపై చేసిన కామెంట్స్ పెద్ద రచ్చ అవుతున్నాయి.
సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఇటీవల కాలంలో బాగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన పలు ప్రెస్ మీట్లలో చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చ అవుతున్నాయి. ఆ మధ్య ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ `పుష్ప 2` సినిమాపై విమర్శలు చేశారు.
దీంతో ఆయన కామెంట్స్ వివాదంగా మారాయి. ఆ తర్వాత వాటికి వివరణ ఇచ్చారు. మరో సందర్భంలోనూ పద్మ అవార్డులపై కామెంట్లు చేశారు. లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూలోనూ పద్మ అవార్డులపై స్పందించారు. ఆ వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి.
రాజేంద్రప్రసాద్ మరోసారి వివాదాస్పద కామెంట్లు
తాజాగా దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ మరోసారి రచ్చ అవుతున్నాయి. ఇందులో కమెడియన్ అలీ,
అలాగే సీనియర్ నటుడు మురళీ మోహన్, ఇంకోవైపు రోజా, ఆమని, కాదంబరి కిరణ్ వంటి వారిపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజేంద్రప్రసాద్ సరదాగా కామెంట్స్ చేస్తుంటారు. చనువుని బట్టి కొన్ని బూతు పదాలను కూడా ఉపయోగిస్తుంటారు.
అలీపై బూతు పదం ఉపయోగించిన రాజేంద్రప్రసాద్
ఎస్వీకృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ వేడుకకు ఇంత మంది వస్తారనే విషయం ముందు తనకు చెప్పలేదని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత అరేయ్ అలీ అంటూ ఓ దారుణమైన బూతు పదాన్ని ఉపయోగించారు.
శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, ఉత్తేజ్, మురళీ మోహన్, కాదంబరి కిరణ్ తోపాటు చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
అందరి ముందు రాజేంద్రప్రసాద్ ఇలాంటి బూతు పదం వాడటం ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా మనకు అలవాటే కదా అంటూ కవర్ చేశారు. దీనికి అలీ నవ్వుతూ రియాక్ట్ అయ్యారు.
మురళీ మోహన్పై రెచ్చిపోయిన రాజేంద్రప్రసాద్
ఇక తనకు ఎన్టీఆర్ పురస్కారాన్ని అందించారని, ఆ కార్యక్రమానికి వెళ్లి వచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా క్లాప్స్ కొట్టాలని రాజేంద్రప్రసాదే కోరారు. బుద్ది ఉందా లేదా నాకు అంటూ ఆయనపై ఆయనేసెటైర్లు వేసుకున్నారు.
ఇంతలో స్టేజ్పైనే ఉన్న మురళీ మోహన్ స్పందిస్తూ, చెప్పి మరీ కొట్టించుకుంటున్నావ్ అన్నారు. దీనికి రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ, చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య, దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేదని లెక్క అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మురళీ మోహన్ కూడా ఈ విషయాన్ని నవ్వుతూనే తీసుకున్నారు.
మాజీ మంత్రి రోజాపై రాజేందప్రసాద్ క్రేజీ కామెంట్
ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ మాట్లాడుతుండగా మధ్యలో మాజీ మంత్రి, నటి రోజా వచ్చారు. ఆమెని హాయ్, హలో అంటూ విష్ చేసిన రాజేంద్రప్రసాద్, ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్ ని చేశాను కదా అంటూ తనదైన స్టయిల్లో రెచ్చిపోయారు.
ఆ తర్వాత ఆమనిని కూడా వదల్లేదు, నిన్ను కూడా హీరోయిన్ని చేసింది నేనే అంటూ కామెంట్ చేశారు. మరోవైపు కాదంబరి కిరణ్ని పట్టుకుని కాకి(కాదంబరి కిరణ్) అంటూ పిలవడం ఆశ్చర్యపరించింది.
రాజేంద్రప్రసాద్ కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్, రచ్చ రచ్చ
అయితే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను అక్కడ ఉన్న వారంతా నవ్వుతూనే తీసుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇవి తప్పుగా వెళ్తున్నాయి. పబ్లిక్ లోకి వెళ్లినప్పుడు కచ్చితంగా అవి అభ్యంతరంగానే ఉంటాయి. వారిని అవమానించినట్టుగానే ఉంటాయి.
దీంతో పెద్ద రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. రాజేంద్రప్రసాద్ నోటి దురుసు వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలని, ఇలాంటి మాటలతో ఆయన పరువు తీసుకుంటున్నారని అంటున్నారు.
మీకూ మీకూ మధ్య ఏమున్నా పర్సనల్గా మాట్లాడుకోండి, కానీ స్టేజ్మీదకు వచ్చి ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి బూతులతో కౌంటర్ ఇస్తున్నారు. ఇది నెట్టింట పెద్ద రచ్చ అవుతుంది. మరి దీనికి రాజేంద్రప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.