సారాంశం
పేటీఎం, టికెట్ న్యూ, జస్ట్ టికెట్స్, ఫిల్మీ బీట్, ఐఎండిబి, స్పైసీ ఆనియన్ మూదలైన యాప్స్ పోటీ పడుతున్నాయి. అగ్రస్థానం బుక్ మైషో దే!
సినిమా ప్రియులందరికి బాగా పరిచయం ఉన్న యాప్ ‘బుక్ మై షో’. ఈ యాప్ ద్వారా మనమిప్పుడు ఇంటిదగ్గర్నుంచే టికెట్లు బుక్ చేసుకుంటున్నాము. 650 లకి పైగా పట్టణాల్లో అవుట్లెట్స్ ని కలిగి వున్న ఈ కంపెనీ లక్షల కొద్దీ వినియోగదారులకి సాటిలేని వినోద అనుభవాలని అందిస్తోంది. 6,000 లకి పైగా స్క్రీన్లలో ప్రదర్శించే సినిమాలకి టికెట్లని విక్రయించే సేవల్ని అందిస్తోంది. ఈ రంగంలో ఇంకా పేటీఎం, టికెట్ న్యూ, జస్ట్ టికెట్స్, ఫిల్మీ బీట్, ఐఎండిబి, స్పైసీ ఆనియన్ మూదలైన యాప్స్ పోటీ పడుతున్నాయి. అగ్రస్థానం బుక్ మైషో దే!
ఈ పాపులర్ సినిమా ఆన్ లైన్ బుకింగ్ యాప్ కంపెనీ కోవిడ్ టైమ్ లో పడుకుందనే చెప్పాలి. అప్పుడు జనాలు థియేటర్స్ కు వెళ్లటం తగ్గించటంతో పూర్తిగా డౌన్ అయ్యింది. కానీ బాలీవుడ్ మెల్లిగా పుంజుకోవటం, సౌత్ ఇండియా మార్కెట్ రెట్టింపు అవటంతో ఒక్కసారిగా ఈ యాప్ రెవిన్యూ 13 రెట్లు పెరిగింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఈ రెండు ఫైనాన్సియల్ ఇయిర్స్ (FY22 & FY23)లో మతి పోయే రెవిన్యూలను నమోదు చేసింది. ఓరకంగా 2023 ఆర్ధిక సంవత్సరంలో జాక్ పాట్ కొట్టింది. వివరాల్లోకి వెళితే..
‘బుక్ మై షో’ అనే ఈ ఆన్ లైన్ బుకింగ్ యాప్ కంపెనీ 2023 ఆర్ధిక సంవత్సరంలో రూ. 85 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది బుక్ మై షో కి బ్లాక్బస్టర్ సంవత్సరంగా చెప్పాలి. మొత్తం నిర్వహణ ఆదాయంలో 66 శాతంగా వున్న కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం టిక్కెట్ అమ్మకాల ద్వారా 2023 ఆర్ధిక సంవత్సరంలో రూ. 648 కోట్లకు చేయింది. ఆర్ధిక సంవత్సరం 2022 లో సాధించిన రూ. 227 కోట్ల నుంచి 2.85 రెట్లు పెరిగింది. గత ఆర్ధిక సంవత్సరం రూ. 92 కోట్ల నష్టంతో వున్న కంపెనీ ఈ ఆర్ధిక సంవత్సరం రూ. 85 కోట్లు లాభం గడించడం విశేషం.
అందుకు కారణం ...ఈ నిర్మాణ సంస్థ స్థాపించిన లైవ్ ఈవెంట్లు, సినిమా టిక్కెట్ల విక్రయాలు. కోవిడ్ మహమ్మారి రెండేళ్ళ కాలంలో లో కఠిన సవాళ్ళని ఎదుర్కొంది. కరోనా కారణంగా ఈవెంట్స్, సినిమా థియేటర్లు మూత పడటంతో బుక్ మై షో పరిస్థితి తారుమారైంది. దాదాపు 15 నెలలుగా బుక్ మై షో నామమాత్రపు సేవలు అందింది. దాంతో జూన్ 2021లో 200 మంది ఉద్యోగుల్ని తొలగించక తప్పలేదు. మహమ్మారి బారిన పడిన 2021 సంవత్సరంలో మల్టీప్లెక్సుల, లైవ్ ఈవెంట్ల మూసివేత కారణంగా కంపెనీ ఆదాయం రూ. 74 కోట్లకు క్షీణించింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్థిక నివేదికల ప్రకారం, 2023 లో థియేటర్లకి తిరిగి వచ్చిన ప్రేక్షకులతో, లైవ్ ఈవెంటల అధిక డిమాండ్తో, బుక్మైషో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 3.5 రెట్లు పెరిగి, రూ. 976 కోట్లకు చేరుకుంది. 2022లో ఇది రూ. 277 కోట్లుగా ఉంది.
అలాగే 2022 క్యాలెండర్ సంవత్సరంలో దేశంలోమొత్తం బాక్సాఫీసు ఆదాయం రూ. 10, 637 కోట్లకి చేరుకుంది. ఇది 2019లో కోవిడ్ కి ముందు ఆదాయం రూ. 10,948 కోట్లతో దాదాపుగా సమానంగా ఉంది. 2023 సంవత్సరం బాక్సాఫీసుకి రికార్డు -బ్రేకింగ్ సంవత్సరంగా అంచనా వేశారు. ఆదాయం రూ. 12, 000 కోట్లకు చేరువైంది. మొత్తం నిర్వహణ ఆదాయంలో 66 శాతంగా వున్న కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం సినిమా టిక్కెట్ అమ్మకాల నుంచి వచ్చింది. ఇది 2023 ఆర్ధిక సంవత్సరంలో రూ. 648 కోట్లకు చేరుకుంది. 2022 ఆర్ధిక సంవత్సరంలో రూ. 227 కోట్లుగా వుంది. అంటే 2.85 రెట్లు పెరిగింది. లైవ్ ఈవెంట్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయమైన వృద్ధిని సాధించింది. 2023 లో ఇది రూ. 237 కోట్లకు చేరుకుంది. అంటే 9.5 రెట్లు గణనీయంగా పెరిగింది. మార్కెటింగ్, స్ట్రీమింగ్, ఆహార పానీయాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో కలిపి 2023 లో కంపెనీ మొత్తం రూ. 1026 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.
ఈ కామర్స్ రంగం మొగ్గదశలో ఉన్నప్పుడు 1999లో ఆశీష్ హేమ్రజనీ బుక్మైషో ను ప్రారంభించారు. అంచెలంచెలుగా దేశమంతటా తమ సర్వీసులు విస్తరించారు. ఇంటర్నెట్ లోకి వెళ్ళి సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు లేదా కచేరీల కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని కొన్నేళ్ళ క్రితం ఎవరూ అనుకోలేదు. దీన్ని ఆశిష్ హేమ్రజనీ సుసాధ్యం చేశాడు. దేశంలో అగ్రగామి ఆన్లైన్ మూవీ టిక్కెట్ బుకింగ్ సంస్థగా బుక్మై షో ఉంది. ఈ సంస్థ 2017 డిసెంబరులో ఒక కొత్త ఆండ్రాయిడ్ యాప్ను ఆవిష్కరించింది. ఇది డిస్కవర్, డిసైడ్,బుక్ అనే మూడు వరుస విధానాల ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు మూవీ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని, సరికొత్త అనుభూతులను ఇది అందించగలదని ఆ సంస్థ పేర్కొంది. ఈ అత్యాధునిక యాప్ ద్వారా వినియోగదారులు గతంలో కంటే వేగంగా బుకింగ్ జరుపుతున్నారు. అప్పటి నుంచీ ఈ యాప్ గ్రోత్ ఊహించని విధంగా ఉంటూ వస్తోంది.