Asianet News TeluguAsianet News Telugu

Budget 2024 : రోటీ, లోటు, రైతులు.. ఫిబ్రవరి 1న చూడవలసిన ఏడు విషయాలు ఇవే..

బడ్జెట్ లోటును కాలక్రమేణా 4.5%కి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది ప్రాథమిక సౌకర్యాలు, సబ్సిడీలను అరికట్టడం వంటి అంశాలకు ఎక్కువ ఖర్చు చేస్తోంది.

Budget 2024 : Roti, Deficit, Farmers.. These are the seven things to watch on February 1 - bsb
Author
First Published Jan 29, 2024, 12:30 PM IST


మోడీ ప్రభుత్వంపై ఈసారి ప్రజాకర్షక చర్యలకు సంబంధించిన ఒత్తిళ్లు తగ్గాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి చేయబోయే బడ్జెట్ ప్రసంగంలో చూడాల్సినవి ఏమిటో ఇలా చెబుతున్నారు. 

లోటు
మహమ్మారి సమయంలో జిడిపిలో 9.2%కి పెరిగిన తరువాత, అప్పులను అదుపులో ఉంచడానికి కేంద్రం ద్రవ్య లోటును క్రమంగా తగ్గిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ సర్వే చేసిన ఆర్థికవేత్తల ప్రకారం, మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9% లోటు లక్ష్యాన్ని చేరుకోవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.3%కి తగ్గించవచ్చు.

ఆర్థిక ఫిట్‌నెస్‌ 
ఈ సంవత్సరం బడ్జెట్ లోటుకు సంబంధించి ఎక్కువ భాగం పన్ను వసూళ్లు పెరగడం వల్ల వచ్చింది. హెచ్ఎస్ బీసీ హోల్డింగ్స్ ప్రకారం, ఆదాయపు పన్ను గత ఆర్థిక సంవత్సరం కంటే 30% ఎక్కువగా ఉంది. కార్పొరేట్ పన్ను 20% పెరిగింది. జీఎస్ టీ 10% ఎక్కువ పెరిగింది.

కాలక్రమేణా బడ్జెట్ లోటును 4.5%కి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది, అయితే ఇది మౌలిక సదుపాయాలు, సబ్సిడీలను అరికట్టడం వంటి అంశాలకు ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధి దృక్పథానికి బాగా ఉపయోగపడుతోందని హెచ్ఎస్ బీసీ ఒక నోట్‌లో తెలిపింది.

రుణాలు
రాబోయే ఆర్థిక సంవత్సరంలో రుణాలు దాదాపు రూ.180.5 బిలియన్ల రికార్డుకు సమీపంలో ఉంటాయి. బాండ్ మార్కెట్, ఈ సంవత్సరం గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లలో భారత్‌కు స్థానం లభిస్తే విదేశీ డిమాండ్ పెరగనుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.

Budget 2024 : కొత్త పన్ను విధానం మీకు అనుకూలంగా మారబోతుందా?

మౌలిక సదుపాయాలు
రోడ్లు, ఓడరేవులు, పవర్ ప్లాంట్ల ఖర్చులకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం గత మూడేళ్లలో ఏటా దాదాపు మూడింట ఒక వంతు మూలధన వ్యయాన్ని పెంచింది. ఇది 7% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించడంలో సహాయపడింది. మనదేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మార్చింది.

రైతులు
బియ్యం, గోధుమలు, పంచదార ఎగుమతులను నిషేధించడం, రైతుల ఆదాయాన్ని తగ్గించడం లాంటి చర్యలతో.. పెరుగుతున్న ఆహార ధరలను అరికట్టడానికి గత సంవత్సరం తీసుకున్న అనేక దూకుడు చర్యల తర్వాత ప్రభుత్వం రైతులకు మరింత ఆర్థిక మద్దతునిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు 65% మంది నివసించే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, వర్షపాతం పంటలను ప్రభావితం చేసింది.

సబ్సిడీలు
మోడీ ప్రభుత్వం ఇప్పటికే వంట గ్యాస్, ఎరువులపై సబ్సిడీలను పెంచింది. 142 బిలియన్ డాలర్ల వ్యయంతో 800 మిలియన్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార కార్యక్రమాన్ని పొడిగించింది. రైతు ఆదాయ బదిలీ, అందరికీ ఇళ్లు, ఆరోగ్య బీమా వంటి కొన్ని ప్రసిద్ధ పథకాలతో సంక్షేమ వ్యయం పెరుగుతుందని జెఫరీస్ ఇండియా లిమిటెడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 
ఈ సంవత్సరం 4% పెరుగుదలతో పోలిస్తే, ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే రాబోయే ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీలను మినహాయించి సామాజిక వ్యయం 8% వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మహిళలు
మీడియా నివేదికలు ఫిబ్రవరి 1 బడ్జెట్‌లలో గిగ్ జాబ్‌లతో సహా అనధికారిక రంగంలోని కార్మికులకు సామాజిక భద్రతా నిధిని సూచిస్తున్నాయి. వంట గ్యాస్ సబ్సిడీలు,యు తక్కువ రుణాలు కూడా మహిళలను ఆకర్షించడానికి లిస్టులో చేర్చే అవకాశం ఉంది. ఃసీతారామన్ భూమి ఉన్న మహిళా రైతులకు వార్షిక చెల్లింపును 12,000 రూపాయలకు రెట్టింపు చేసేలా చూడవచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు “వచ్చే మూడేళ్లలో 7.5 మిలియన్ల మంది కొత్త లబ్ధిదారులకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలనే ప్రభుత్వం యోచిస్తున్న క్రమంలో.. ఎక్కువ ఖర్చు ఉండొచ్చు” అని క్వాంట్ ఎకో రీసెర్చ్ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios