Asianet News TeluguAsianet News Telugu

వేతన జీవులకు ఊరట.. ఆదాయపు పన్ను పరిమితి రూ. 7 లక్షలకు పెంపు.. వారికి మాత్రమే..

కేంద్ర బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 

Budget 2023 No income tax up to Rs 7 lakh under new regime
Author
First Published Feb 1, 2023, 1:03 PM IST

వేతన జీవులకు కేంద్రం ఊరటనిచ్చే వార్తను చెప్పింది. బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ 2023-24ను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించారు.  ప్రస్తుతం రూ. 5 లక్షలుగా ఉన్న వ్యక్తిగత ఆదాయ పన్నుమినహాయింపు పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టుగా తెలిపారు. అయితే ఇది నూతన పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ప్రభుత్వం పలు మార్పులను ప్రవేశపెట్టింది.

రూ. 3 లక్షల వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను ఉండదు. రూ.  3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఆదాయం ఉంటే 5 శాతం పన్ను విధించబడుతుంది. రూ.  6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ఆదాయం ఉంటే 10 శాతం పన్ను విధించబడుతుంది. రూ.  9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉంటే 15 శాతం పన్ను విధించబడుతుంది. రూ.  12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయం ఉంటే 20 శాతం పన్ను విధించబడుతుంది. రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించబడుతుంది.

ఇక, 

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని.. ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోందని అన్నారు. బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా వివరించారు. వాటిని సప్తరుషి అని పేర్కొన్నారు. 

ఏడు ప్రాధాన్యతలు..
1. సంపూర్ణ అభివృద్ధి
2. చివరి మైలు చేరుకోవడం
3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడి,
4. సామర్థ్యాలను వెలికితీయడం
5. గ్రీన్ డెవలప్మెంట్
6. యువ శక్తి
7. ఆర్థిక రంగం బలోపేతం

బడ్జెట్ లో ప్రధానాంశాలు ఇవే..
>> భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేశారు. 
>> కరోనా సమయంలో, ప్రభుత్వం 80 కోట్ల మందికి 28 నెలల పాటు ఉచిత రేషన్ కోసం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలను వెచ్చించింది.
>> 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని, మొత్తం ఆదాయం రూ.1.97 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు. అదే సమయంలో, భారతదేశం >> ఇప్పుడు ప్రపంచంలో 8వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
>> ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై వ్యయం 66 శాతం పెరిగి రూ.79,000 కోట్లకు చేరుతుంది. 
>> రెసిడెన్షియల్‌ పిల్లల కోసం రానున్న మోడల్స్‌లో 740 వన్‌వే పాఠశాలల్లో 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు.
>> వైద్య విద్యను పెంపొందించేందుకు 2014 నుంచి ప్రస్తుతం ఉన్న 157 మెడికల్ కాలేజీలకు అదనంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.  
>> పాన్‌ కార్డుకు సంబంధించి ఆర్థిక మంత్రి కూడా పెద్ద ప్రకటన చేశారు. ఇకపై పాన్ కార్డును జాతీయ గుర్తింపు కార్డుగా పిలుస్తామని చెప్పారు. ఇంతకుముందు పాన్ అనేది పన్ను దాఖలు కోసం ఉండేది.
>> ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేటాయింపును 66 శాతం పెంచి 79,000 కోట్లకు పెంచింది. ప్రజలు నివసించేందుకు ఇళ్లను వేగంగా కేటాయిస్తామని సీతారామన్ చెప్పారు.
>> మహిళా పొదుపు సమ్మాన్ పత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
>> సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పరిమితిని రూ.15 నుంచి రూ.30 లక్షలకు పెంచారు.

Follow Us:
Download App:
  • android
  • ios