Asianet News TeluguAsianet News Telugu

ఏ తిథి రోజు ఏ పూజ చేయాలి?

వేద సమయానుసారం ఒక చాంద్రమానరోజును తిథి అంటారు. శుక్లసక్షంలో పాడ్యమినుండి పూర్ణిమ వరకు 15, మళ్ళీ కృష్ణ పక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు  15 మొత్తం 30 తిథులు.

the story of thithulu
Author
Hyderabad, First Published Feb 13, 2019, 10:04 AM IST

వేద సమయానుసారం ఒక చాంద్రమానరోజును తిథి అంటారు. శుక్లసక్షంలో పాడ్యమినుండి పూర్ణిమ వరకు 15, మళ్ళీ కృష్ణ పక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు  15 మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతుంది. చంద్రుడు రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారుతాయి.

మనం దేవతలను పలురకాలుగా మనకు వీలైన రీతిలో పూజిస్తూ ఉంటాం. ఆ విధంగా చేసే పూజలు నియమ నిష్ఠలతో చేసినట్లైతే తగిన ఫలితం వస్తుంది. దీనికి సంబంధించిన తిథులు, వాటి ప్రత్యేకత ఏ రోజు ఏ దేవతను పూజిస్తే ఎంతి ఫలం కలుగుతుందో తెలుసుకుందాం.

పాడ్యమి : అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు ఆ తిథినాడు ప్టుటినందువల్ల ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం.

తదియ : గౌరీదేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియనాడు జరిగినందువల్ల, గౌరీ దేవికి ఆ తిథి అంటే ఇష్టం. ఇది ప్రత్యేకంగా స్త్రీలకోసం ఏర్పాటు అయినది.

చవితి : వినాయకుడు పుట్టినతిథి. వినాయకచవితినాడే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.

పంచమి : పంచమినాడు నాగులు జన్మించాయి. అందుకే నాగదేవతలకు పంచమితిథి, నాగుల చవితి అంటే చాలా ఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజచేస్తే నాగుల వల్ల భయం ఉండదు.

షష్ఠి : కుమారస్వామి/ సుబ్రహ్మణ్యస్వామి జన్మతిథి/ ఆ రోజున అర్చన చేసినట్లైతే సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందగలరు.

సప్తమి : సూర్యుని జన్మతిథి. రథసప్తమినాడే కాకుండా ప్రతీ శుద్ధ సప్తమినాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.

అష్టమి : దుర్గాదేవి అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథి. అష్టమాతృకలను, దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.

నవమి : దుర్గాదేవికి ప్రీతికరమైనది. ఆ తిథినాడు దుర్గను పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.

థమి : థమినాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాదిదేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగుతాయి.

ఏకాదశి : కుబేరుడు పుట్టిన తిథి. ఈ తిథిన కుబేరపూజ చేస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.

ద్వాదశి : విష్ణువుకు ఇష్టమైన తిథి. ఈ తిథిరోజే విష్ణుమూర్తి, వామన రూపంలో జన్మించాడు. ద్వాదశినాడు ఆవునెయ్యితో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.

త్రయోదశి : ధర్మరాజు పుట్టిన తిథి. ఈ రోజున ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు తలచుకొని పూజిస్తే ఫలం చేకూరుతుంది.

చతుర్దశి : రుద్రుని తిథి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం. కృష్ణ చతుర్దశినాడు మాస శివరాత్రి వస్తుంది. ఈ తిథి శివుడికి ప్రీతికరం.

అమావాస్య : పితృదేవతలకు ఇష్టమైన తిథి. దర్భలు, నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్ణణమిస్తే వారు సంతోషించి సంతానసౌఖ్యం అనుగ్రహిస్తారు.

పౌర్ణమి : చంద్రుడు అధిపతి. పౌర్ణమినాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజించినట్లైతే ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.

కావున ప్రతీ ఒక్కరు ఆయా తిథులరోజున ఆ దేవతలను పూజించి ఆనందాన్ని పొందగలరు.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios